సంకట స్థితిలో ‘సర్కారు’ విద్యార్థుల చదువు
సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన
బడుల మూసివేతపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
రెండు, మూడు రోజుల తర్వాత తెరుస్తామంటున్న ట్రస్మా
ఈనాడు, హైదరాబాద్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన జీవోలో స్పష్టంచేయలేదు. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అదే సమయంలో ఆ తర్వాత బడులు తెరుస్తారా? అన్నది అప్పటి కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఇంటర్ విద్యాశాఖ టీవీ పాఠాలను ప్రసారం చేస్తూనే ఉంది. వర్సిటీలు కూడా పచ్చజెండా ఊపాయి. ఇంకా ప్రభుత్వం అనుమతించినా? ఇవ్వకున్నా ప్రైవేట్ పాఠశాలలను ఆన్లైన్ పాఠాలు నిర్వహించకుండా విద్యాశాఖ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విద్యా సంవత్సరం సెప్టెంబరు 1 నుంచి జనవరి 8వ తేదీ వరకే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. మొత్తానికి ఈసారి కూడా ప్రైవేట్ విద్యార్థులతో పోల్చుకుంటే సర్కారు బడుల పిల్లలు విద్యా అభ్యసనాల విషయంలో బాగా నష్టపోయారు. ఈసారి ఉపాధ్యాయులందరికీ టీకాలిచ్చారు. 15-18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా 80 శాతం వరకు పూర్తయింది. పదో తరగతిలో 50 శాతం మేరకే సిలబస్ పూర్తయినందున కనీసం వారికైనా బడులు తెరవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెలవుల పొడిగింపు సమంజసం కాదు: సంఘాలు
విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. కొవిడ్ మూడో దశ ప్రభావం రాష్ట్రంలో పరిమితంగానే ఉందని, సామూహిక, సామాజిక, వ్యాపార కార్యకలాపాలన్నీ యథావిధిగా నడుస్తున్నాయని, విద్యాసంస్థలను ఎందుకు మూసివేస్తున్నారని టీఎస్యూటీఎఫ్ ప్రశ్నించింది. ‘ప్రత్యక్ష తరగతులు కొనసాగించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది.‘పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించడానికి అనుకూల పరిస్థితులు, అవసరమైన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టకుండా సెలవులు పొడిగించడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’ అని టీపీటీఎఫ్ పేర్కొంది. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతో చర్చించకుండా సెలవులు ప్రకటించడం సరికాదని డీటీఎఫ్ పేర్కొంది.
తీవ్రంగా ఖండించిన ట్రస్మా
సెలవుల పొడిగింపును తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఖండించింది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ‘రెండు మూడు రోజులు చూసి సర్కారు అనుమతి ఇవ్వకున్నా బడులు తెరుద్దాం. మీరంతా సిద్ధంగా ఉండండి’ అని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు పాఠశాలల యజమానులకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?