రిజర్వేషన్లు.. ప్రతిభకు విరుద్ధం కాదు
నీట్- పీజీ, యూజీ సీట్లకు రిజర్వేషన్లలో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్.. ప్రతిభకు విరుద్ధం కాదంది. అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్,
నీట్లో ఓబీసీ కోటాను సమర్థించిన సుప్రీంకోర్టు
21-22 విద్యా సంవత్సర ప్రవేశాలకు అనుమతి
దిల్లీ: నీట్- పీజీ, యూజీ సీట్లకు రిజర్వేషన్లలో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్.. ప్రతిభకు విరుద్ధం కాదంది. అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్కు 10% కోటా కల్పించడం రాజ్యాంగ బద్ధమేనని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం గురువారం పేర్కొంది. కొన్ని తరగతులు పొందే ఆర్థిక- సామాజిక ప్రయోజనాన్ని పోటీ పరీక్ష ప్రతిబింబించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో రిజర్వేషన్లు ఇచ్చేముందు ఇకపై సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం నీట్ పీజీ ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతించింది. ‘‘పనితీరుకు సంబంధించిన సంకుచిత నిర్వచనాలతో ప్రతిభను కుదించలేరు. ఇప్పటికీ కరోనా మన మధ్య ఉంది. వైద్యుల్ని నియమించడంలో ఎంతమాత్రం ఆలస్యమైనా పరిస్థితిని ఎదుర్కోవడంపై అది ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి జాప్యం లేకుండా అడ్మిషన్ల ప్రక్రియను, కౌన్సిలింగ్ను అనుమతించాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికను పిటిషనర్లు సవాల్ చేశారు. దీనిపై సవివరంగా అన్ని పక్షాల వాదనల్ని వినాలి. అయితే పిటిషన్ పెండింగులో ఉండడం వల్ల కౌన్సిలింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యం దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతించాలని మేం భావిస్తున్నాం. నిబంధనలు ఏకపక్షమని న్యాయస్థానం భావిస్తే తప్ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. అందువల్ల 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించడానికి అనుమతిస్తున్నాం’’ అని పేర్కొంది.
కోటాతో అవకాశాలు లభిస్తాయి
‘‘బహిరంగ పరీక్షల ద్వారా అభ్యర్థులందరికీ పోటీలో సమాన అవకాశాలు లభిస్తే, ఆ అవకాశాలు వెనుకబడిన తరగతులూ పొందేందుకు రిజర్వేషన్లు వీలు కల్పిస్తాయి. సాధారణంగా వ్యవస్థీకృత అడ్డంకుల వల్ల వారికి కొన్ని అవకాశాలు అందవు. హక్కులు, అవకాశాలకు దూరమైనవారికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గం. రిజర్వేషన్ అనేది ప్రతిభకు అడ్డంకి కాదు. అది ప్రభావశీల పంపిణీని ప్రోత్సహిస్తుంది. విద్యారంగంలో ఉన్న సదుపాయాలు పొందడంలో ఉన్న అసమానతల వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఇతరులతో సమర్థంగా పోటీ పడలేరు. రిజర్వేషన్లు వంటి ప్రత్యేక అవకాశాలు కల్పించడం ద్వారా అలాంటివారు ఆ అడ్డంకుల్ని అధిగమించి, ఇతర వర్గాలతో సమానంగా పోరాడడానికి వీలుంటుంది. అభివృద్ధి చెందిన వర్గాలవారికి నాణ్యమైన పాఠశాల విద్య, కోచింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. కుటుంబాల నేపథ్యం వారికి కలిసివస్తుంది. పోటీ పరీక్షలకు వారు అన్ని విధాలా బాగా సిద్ధం కాగలరు. ఇలాంటి అవకాశం లేని వర్గాలవారు వీరితో పోటీ పడలేక నష్టపోతారు. వారు చాలా అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య పొందడానికి కష్టపడి కృషి చేయవద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. ప్రతిభ అనేది కేవలం ఒకరి స్వయంకృషి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల వాతావరణమూ దానికి దోహదపడుతుంది. వ్యక్తి ప్రతిభకు మార్కులు ఒక్కటే అన్నివేళల్లో కొలమానం కాకపోవచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు ప్రాతిపదికను నిర్ణయించడానికి ఎంచుకున్న ప్రాతిపదిక చెల్లుబాటును మార్చిలో వివరంగా పరిశీలిస్తామని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు