Bathini Fish Prasadam: ఈ ఏడాదీ చేప ప్రసాదం పంపిణీ లేదు

ఆస్తమా రోగం నయం కోసం మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపట్టే చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది కూడా నిలిపివేశామని బత్తినిగౌడ్‌ సోదరులు తెలిపారు.

Updated : 26 May 2022 08:36 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఆస్తమా రోగం నయం కోసం మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపట్టే చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది కూడా నిలిపివేశామని బత్తినిగౌడ్‌ సోదరులు తెలిపారు. హైదరాబాద్‌ దూద్‌బౌలికి చెందిన బత్తిని హరినాథ్‌గౌడ్‌, బత్తిని గౌరీశంకర్‌గౌడ్‌, బత్తిని శివకుమార్‌గౌడ్‌, బత్తిని అమర్‌నాథ్‌గౌడ్‌లు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. కరోనా నేపథ్యంలో 2020 నుంచి పంపిణీ చేయడంలేదు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి కూడా చేపప్రసాదం పంపిణీని నిలిపివేశామని వారు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని