ఇష్టానుసారం పేర్లను తొలగించడం సరికాదు
ధరణి నుంచి పేర్లను తీసేయడంపై హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్: ధరణి పోర్టల్లో అధికారులు ఇష్టానుసారం రైతుల పేర్లను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలా తీసేసే ముందు కొన్ని విధి విధానాలను అనుసరించాలని వ్యాఖ్యానించింది. కామారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన 76 మంది రైతుల పేర్లను పోర్టల్ నుంచి తొలగించడంపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించింది. లేని పక్షంలో కలెక్టర్తోపాటు ఆర్డీవో ఈ నెల 15న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పేర్లను ధరణి పోర్టల్ నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ యాచారం మండలానికి చెందిన భూపల్లి సాయిలు మరో 75 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ ముమ్మనేని సుధీర్కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆనందం వాదనలు వినిపిస్తూ సాజ్య నాయక్ తాండ, పూర్యనాయక్ తాండ, గాంధారీ ఉట్నూరు, లక్ష్మీనాయక్ తాండ తదితర గ్రామాలకు చెందిన 75 మంది రైతుల పేర్లను పోర్టల్ నుంచి అధికారులు తొలగించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం భూమిలేని రైతులకు అర ఎకరం నుంచి 3 ఎకరాల వరకు కేటాయించి, పట్టాలను కూడా మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వారి పేర్లను ధరణి పోర్టల్లో నమోదు చేయడంతోపాటు రైతుబంధు సాయం కూడా అందించారన్నారు. ఉన్నట్టుండి ఆ రైతుల పేర్లను ధరణి పోర్టల్ నుంచి తొలగించడంతో రైతుబంధుతోపాటు ఇతర పథకాల సాయం కూడా వారికి అందడంలేదన్నారు. అది అటవీ భూమి అని ప్రభుత్వ న్యాయవాది చెప్పబోగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎప్పుడో కేటాయించిన భూమికి ఇప్పుడు ఇలా చెప్పడం సరికాదన్నారు. రైతుబంధు సాయం అందించే సాయాన్ని మిగల్చడానికన్నట్లు ధరణి పోర్టల్లో ఇష్టానుసారం పేర్లను తొలగించడం సరికాదన్నారు. దీనిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై విచారణ ముగిసేదాకా రైతులను భూముల నుంచి ఖాళీ చేయించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
-
Ts-top-news News
TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- మరో బాదుడు
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్ఇండియా కెప్టెన్గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్ స్టైరిస్
- Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం