Telangana High Court: హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా
కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఇంకో అయిదు కోర్టులకు 29 మంది
గత 5 రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్ల ప్రతిపాదన
ఈనాడు - దిల్లీ
తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్ప్రదేశ్ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్కతా (9), పంజాబ్, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈనెల 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదురోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.
కొలీజియం సిఫార్సు చేసిన వారి నేపథ్యం
ఏనుగుల వెంకట వేణుగోపాల్
కరీంనగర్ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. తండ్రి ఇ.వి.రాజేశ్వర్రావు (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్), తల్లి ఇ.వి.బాలకుమారి (ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు). కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. కొంత కాలం కరీంనగర్లో ప్రాక్టీస్ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దివంగత రామ్జెఠ్మలానీ వద్ద జూనియర్గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
నగేష్ భీమపాక
భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరావు, శాంతమ్మలకు 1969 మార్చి 8న జన్మించారు. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి ఏలూరు సీఆర్ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. లాలో పోస్టుగ్రాడ్యుయేషన్ను హైదరాబాద్ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993లో బార్ కౌన్సిల్లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
పుల్లా కార్తీక్
జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మలకు 1967 జూన్ 4న జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల,కళాశాలల్లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్ చదివారు. డిగ్రీ, పీజీలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఉస్మానియాలోనే లా, ఎల్ఎల్ఎంలు చదివారు. 1996లో బార్కౌన్సిల్లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించి, 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
కాజ శరత్
భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబలకు 1971 జనవరి 29న జన్మించారు. పాఠశాల విద్యతో పాటు డిగ్రీని భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1997లో బార్కౌన్సిల్లో నమోదయ్యాక కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. అనంతరం 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.
జగ్గన్నగారి శ్రీనివాసరావు
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. తండ్రి జె.మాణిక్యరావు. ఉస్మానియాలో బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి 1999లో బార్కౌన్సిల్లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగుతున్నారు.
నామవరపు రాజేశ్వర్రావు
మహబూబాబాద్ జిల్లా సూదనపల్లిలో ఎన్.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్ 30న జన్మించారు. పాఠశాల విద్య వరంగల్ సరస్వతి శిశుమందిర్, కాలేజీ విద్య గోవిందరావుపేటలో పూర్తిచేశారు. పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా, తెలంగాణలో యూజీసీ, ఎస్ఎఫ్ఐవో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ ప్యానెల్ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా సేవలందిస్తున్నారు. సివిల్, ఆర్థిక నేరాలు, కార్పొరేట్ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.
-ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..