నిర్లక్ష్యానికి మూల్యం.. నాలుగు ప్రాణాలు
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్ ఆసుపత్రి)లో
కు.ని. శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో మరో ఇద్దరు మహిళల మృతి
మిగిలిన 30 మంది వివిధ ఆసుపత్రులకు తరలింపు
ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
ఆపరేషన్లు చేసిన వైద్యనిపుణుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు
ఈనాడు - హైదరాబాద్
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్ ఆసుపత్రి)లో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మొబైల్ బృందంలో ఉండే ఇద్దరు సర్జన్లు, ఒక అనస్తీషియా వైద్యుడు ఇందులో పాల్గొన్నారు. శస్త్రచికిత్సలు వికటించి ఆదివారం మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత(32), సోమవారం ఉదయం మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(28), అర్ధరాత్రి మాడ్గుల మండలం రాజీవ్నగర్ తండాకు చెందిన మేరావత్ మౌనిక(24), మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్కు చెందిన లావణ్య(28) మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మహిళలు ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్లు, ఇందులో వైద్యుడు, ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా గుర్తించింది. శస్త్రచికిత్స చేశాక పరికరాలను సరిగా స్టెరిలైజేషన్ చేయలేదని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే వీలుంది. ఆపరేషన్లు జరిగిన తరువాత మూడోరోజు ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి మహిళలకు కుట్లు వేసినచోట డ్రెస్సింగ్ చేయాలి. కానీ, కేవలం ఫోన్ చేసి సరిపెట్టినట్లు తెలిసింది. కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్న 34 మందిలో నలుగురు చనిపోగా.. మిగిలిన 30 మందికి ఇళ్ల వద్ద, ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రానికి తరలించీ పరీక్షలు నిర్వహించారు. కొందరికి జ్వరం, కోత దగ్గర చీము, ఇన్ఫెక్షన్ సమస్యలుండడంతో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తొలుత నలుగురిని ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకురాగా.. తర్వాత నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్లో 19 మంది, అపోలో ఆసుపత్రిలో 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రమాదకర పరిస్థితులు లేవని వైద్యవర్గాలు తెలిపాయి. అపోలోలో చికిత్స పొందుతున్న ముగ్గురికి కోత పెట్టినచోట చీము పట్టినట్లు తేలడంతో దాన్ని తొలగించారు. మరికొందరు జ్వరంతో, బీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఆయాసంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను సస్పెండ్ చేసింది. శస్త్రచికిత్సలు చేసిన వైద్యనిపుణులు డాక్టర్ జోయల్ లైసెన్స్ను రాష్ట్ర వైద్య మండలి తాత్కాలికంగా రద్దు చేసింది. ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విషయంపై అక్టోబరు 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ను ఆదేశించింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, హైదరాబాద్ డీఎంహెచ్వో వెంకటి మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి ఆసుపత్రిలోనే ఉండి వైద్య సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ఇకనుంచి రోజుకు గరిష్ఠంగా 10 శస్త్రచికిత్సలే..
ఒకే వైద్యుడు రోజుకు 30-40 సర్జరీలు చేయడం వల్ల ఒత్తిడిలో తప్పులు దొర్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒక సర్జన్ ఒక రోజులో 10 కంటే ఎక్కువ సర్జరీలు చేయకూడదని వైద్యారోగ్యశాఖ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపీ విధానంలో శస్త్రచికిత్సలు చేసే నిపుణులు ప్రభుత్వ వైద్యంలో కేవలం నలుగురే ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం