Kishan Reddy: కిషన్రెడ్డి కుటుంబం ఆస్తులు తగ్గాయ్!
కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కుటుంబం స్థిర, చరాస్తుల విలువ ఏడాదిలో రూ.54,58,003 మేర తగ్గింది. ఆయన కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ. 17,39,04,250.44 ఉండగా.. 2023 ఆగస్టు నాటికి రూ.16,84,46,246.96కి తగ్గాయి.
తగ్గిన స్థిర, చరాస్తుల విలువ రూ.54 లక్షలు
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కుటుంబం స్థిర, చరాస్తుల విలువ ఏడాదిలో రూ.54,58,003 మేర తగ్గింది. ఆయన కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ. 17,39,04,250.44 ఉండగా.. 2023 ఆగస్టు నాటికి రూ.16,84,46,246.96కి తగ్గాయి. ఇదే సమయంలో అప్పులు కూడా రూ.90,68,948 మేర తగ్గాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన మంత్రి తాజా కుటుంబ ఆస్తి, అప్పుల పట్టిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. కేంద్ర మంత్రి కుటుంబం చేతిలో నగదు గత ఏడాది రూ.2,45,000 మేర ఉండగా, ఈ సంవత్సరం అది రూ.3,30,000కి చేరింది. ఇదే సమయంలో చరాస్తుల విలువ రూ.8,82,60,250.44 నుంచి రూ.8,42,49,246.96కి తగ్గింది. నికరంగా మొత్తం కుటుంబ చరాస్తుల విలువ రూ.40.11 లక్షల మేర తగ్గింది. ఇదే సమయంలో కుటుంబ స్థిరాస్తుల విలువ రూ.8,53,99,000 నుంచి రూ.8,38,67,000కి తగ్గిపోయాయి. హిందూ ఉమ్మడి కుటుంబం(హెచ్యూఎఫ్) పేరున ఉన్న ఆస్తి విలువ రూ.40,31,000 మేర తగ్గింది. కుమారుడి పేరున ఉన్న స్థిరాస్తి విలువ రూ.24.99 లక్షల మేర పెరిగింది. సతీమణి పేరున ఉన్న అప్పులు రూ.12,35,448 మేర తగ్గగా, కుమార్తె పేరున ఉన్న రుణాలు రూ.78,33,500 మేర తగ్గాయి.
- చరాస్తుల్లో కిషన్రెడ్డి పేరున మూడు బ్యాంకుల్లో డిపాజిట్లు, కాడిలా హెల్త్కేర్లో 3 వేల షేర్లు, 2 ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. వైష్ణవి అసోసియేట్స్కి రూ.2 లక్షలు, ఇందిరా లెజిస్లేచర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రూ.5 లక్షల రుణం ఇచ్చారు.
- మంత్రి సతీమణి పేరున బంజారాహిల్స్లో 425 చదరపు గజాల స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,78,50,000. 2021 డిసెంబరు 30న యూసుఫ్గూడలో రూ.4,57,31,000 పెట్టి ఆమె 600 చదరపు గజాల స్థలం కొనుగోలు చేయగా, దాని మార్కెట్ విలువను ఇప్పుడూ అంతే చూపారు.
- కుమారుడి పేరున కాచిగూడలో వారసత్వంగా సంక్రమించిన 122 చదరపు గజాల స్థలంలో నిర్మించిన భవనం మార్కెట్ విలువను రూ.1,20,19,000గా చూపారు.
- హిందూ ఉమ్మడి కుటుంబం కింద రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో 8.2850 ఎకరాల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చినట్లు చెప్పారు. ఎకరా రూ.8.80 లక్షల చొప్పున.. రూ.76.67 లక్షలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉన్నట్లు చూపారు. దాని మార్కెట్ విలువ రూ.6 లక్షలు ఉన్నట్లు చెప్పారు.
- కిషన్రెడ్డి పేరున ఉన్న 1995 మోడల్ మారుతీ 800 కారు(రూ.40 వేలు) తప్పితే వీరి కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ కారు లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల