బీబీనగర్ -గుంటూరు మధ్య రెండో లైనుపై మరో ముందడుగు
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్, గుంటూరు మధ్య (239 కి.మీ.) రెండో లైను నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది.
ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు లేఖ
రూ.1,947.44 కోట్ల అంచనాతో సివిల్ నిర్మాణాలు
రూ.905.79 కోట్లతో సిగ్నల్, ఎలక్ట్రికల్ పనులు
త్వరలో టెండర్లు..
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్, గుంటూరు మధ్య (239 కి.మీ.) రెండో లైను నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది. కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ డబ్లింగ్కు ఆమోదం తెలపడంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు ద.మ.రైల్వేకు తాజాగా లేఖ రాసింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.2,853.23 కోట్లుగా పేర్కొంది. ఇందులో సివిల్ పనులకు రూ.1,947.44 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నిర్మాణ పనులకు రూ.586.17 కోట్ల మొత్తాన్ని అంచనా వ్యయాలుగా పేర్కొంది. నిర్మాణ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు దగ్గరి దారి..
సికింద్రాబాద్- విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలున్నాయి. ఇందులో కాజీపేట, ఖమ్మం మార్గంలో ఈ రెండు నగరాల మధ్య దూరం 350 కి.మీ. మరో మార్గమైన బీబీనగర్- నడికుడి- గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336 కి.మీ మాత్రమే. దీనికంటే ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే.. నడికుడి, గుంటూరు మార్గంలో దాదాపు 46 కి.మీ. దూరం తక్కువ. దీంతో ఇది అత్యంత రద్దీ మార్గంగా మారింది. ఈ ట్రాక్ సామర్థ్య వినియోగం ఏకంగా 148.25 శాతం ఉంది. అయితే సింగిల్ ట్రాక్ కావడంతో.. ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్లో పక్కన ఆపాల్సి వస్తోంది. రెండో లైను నిర్మిస్తే ప్రస్తుత రైళ్ల వేగం పెరుగుతుంది. అదనపు రైళ్లు నడిపించడానికి అవకాశం ఉంటుంది. బీబీనగర్-గుంటూరు మార్గంలో 100 కి.మీ. రైల్వే ట్రాక్ ఏపీ పరిధిలో, 139 కి.మీ. రైల్వే ట్రాక్ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైను గరిష్ఠ వేగ సామర్థ్యం 130 కి.మీ. మాత్రమే. వందేభారత్ రైలు సామర్థ్యం 160 కి.మీ.గా ఉంది. దీంతో రెండోలైన్ను 150-160 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించే అవకాశం ఉంది.
4 ఏళ్లు ఆలస్యం.. రూ.373 కోట్ల భారం
నిజానికి ఈ ప్రాజెక్టు 2019-20 కేంద్ర బడ్జెట్ రైల్వే పింక్బుక్లో చూపించారు. అప్పట్లో అంచనా వ్యయాన్ని రూ.2,480 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడంతో.. ఇప్పుడు అంచనా వ్యయం రూ.2,853.23 కోట్లకు చేరింది. అంటే రూ.373 కోట్లు పెరిగింది.
అనేక ప్రయోజనాలు
ఈ రెండో లైన్ నిర్మాణంతో ప్రయాణికులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటు, బొగ్గు రవాణా వేగవంతమవుతుంది. ఈ మార్గంలోని విష్ణుపురం, నడికుడి, జాన్పహాడ్, మేళ్లచెరువు, జగ్గయ్యపేట, రామాపురంలో అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. చిట్యాల, నార్కట్పల్లిలో ఐరన్, స్టీల్ పరిశ్రమలు ఉండగా, విష్ణుపురంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణమవుతోంది. అలానే మిర్యాలగూడ, నల్గొండ, నాగిరెడ్డిపల్లిలో ఎఫ్సీఐ గోదాములున్నాయి. రెండో రైల్వే లైను నిర్మాణం వీటన్నింటికీ మరింత ఉపయోగకరంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం