సీఎం సలహాదారుగా వేం నరేందర్రెడ్డి
నలుగురు కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ శనివారం(ఈ నెల 20) తేదీతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు.
ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్, హర్కర
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి
ఈనాడు, హైదరాబాద్: నలుగురు కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో నియమిస్తూ సాధారణ పరిపాలనాశాఖ శనివారం(ఈ నెల 20) తేదీతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా, మరో ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్, ప్రజాసంబంధాల విభాగాలకు సలహాదారుగా నియమించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సలహాదారుగా నియమించారు. నలుగురికీ కేబినెట్ హోదా కల్పించారు.
వేం నరేందర్రెడ్డి
మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్రెడ్డి ఎంఏ చదివారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్రెడ్డితో పాటు వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డికి అండగా ఉన్నారు.
మల్లు రవి
మల్లు రవి ఎంబీబీఎస్, డీఎల్వో చదివారు. 1991-96లో, 1998-99లో రెండుసార్లు నాగర్కర్నూల్ ఎంపీగా, 2008-09లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో దిల్లీలో పనిచేశారు. ఇప్పుడు అదే పదవిలో మళ్లీ నియమితులు కావడం విశేషం. గతంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
షబ్బీర్ అలీ
షబ్బీర్ అలీ 1970లో ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1989, 2004లలో కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2013 మార్చి 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరేళ్లపాటు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇటీవలి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
హర్కర వేణుగోపాల్
పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన హర్కర వేణుగోపాల్ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం ఛైర్మన్గా ఉన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదుకు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి మిషన్ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నారు. వేణుగోపాల్ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు