Huzurabad By Election: వీవీ ప్యాట్స్ తరలింపుపై నివేదిక ఇవ్వండి
హుజూరాబాద్ ఉపఎన్నిక అనంతరం వీవీప్యాట్స్ తరలింపు విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందజేయాలని ఆదివారం కరీంనగర్ కలెక్టర్, నియోజకవర్గ ....
కరీంనగర్ కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
భాజపా నేతల ఫిర్యాదు నేపథ్యం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు అందజేస్తున్న భాజపా నేతలు డీకే.అరుణ, రాజాసింగ్, రాంచందర్రావు తదితరులు
ఈనాడు, హైదరాబాద్ - బన్సీలాల్పేట్, నారాయణగూడ, న్యూస్టుడే: హుజూరాబాద్ ఉపఎన్నిక అనంతరం వీవీప్యాట్స్ తరలింపు విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందజేయాలని ఆదివారం కరీంనగర్ కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. వీవీప్యాట్స్ను బస్సు నుంచి కారులోకి ఎందుకు తరలించారో, కారణాలేంటో అందులో స్పష్టం చేయాలన్నారు. అంతకు ముందు వీవీప్యాట్ల తరలింపులో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావుతో కలిసి ఆదివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీవీప్యాట్లను తరలిస్తున్న బస్సులను జమ్మికుంట శివారులోని హోటల్ వద్ద నిలిపి, ప్యాట్లను కారులోకి మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు. వీవీప్యాట్లను అక్రమంగా తరలించారనే వార్తల నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో గాంధీజీ విగ్రహం వద్ద భాజపా నేతలు మౌనదీక్ష నిర్వహించారు.‘వీవీ ప్యాట్లు పనిచేయకుంటే స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చాలి లేదా అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లకు విషయం చెప్పాలి.. ప్రైవేటు కార్లలో తరలించడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. సీఎం కేసీఆర్ దర్శకత్వంలోనే ఈ దొంగాటకు తెరలేపారని ఆరోపించారు.
ఓట్ల లెక్కింపుపై సమీక్ష
మరోవంక.. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి కేంద్రంలో జరిపిన ఏర్పాట్లపై కరీంనగర్ కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశాంక్ గోయల్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పటిష్ఠ భద్రతతో తరలించాం: కరీంనగర్ సీపీ
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఈవీఎంల తరలింపు విషయంలో పోలీసులు, అధికారులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్పష్టీకరించారు. ఆదివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నిక తర్వాత ఈవీఎంలను బస్సుల్లో తరలిస్తుండగా జమ్మికుంట ఫ్లైఓవర్ వద్ద ఓ బస్సు టైరు పంక్చరు కావడంతో మిగతావి ఆగిపోయాయని చెప్పారు. వీవీప్యాట్ను కారులో తీసుకెళ్లడాన్ని ఈవీఎంను ఆ వాహనంలోకి మార్చినట్లుగా వీడియో తీసి తప్పుదోవ పట్టించారని వివరించారు. పోలీసులు విచారణ జరపగా అది సాంకేతిక లోపంతో పక్కన పెట్టిన వీవీప్యాట్ అని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి అధికారుల ఆదేశాలతో దాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తీసుకువచ్చినట్లు తేలిందన్నారు. 306 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలను ప్రత్యేక భద్రత, జీపీఎస్ విధానంతో పర్యవేక్షిస్తూ కరీంనగర్కు తరలించామని సీపీ పేర్కొన్నారు. ఈ అంశాలపై పలు పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. జమ్మికుంట, కరీంనగర్లో జరిగిన సంఘటనలపై సీసీ ఫుటేజీ సేకరించి ఎన్నికల అధికారికి సమర్పిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తుల వివరాలు సేకరించి కేసు పెడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్