BJP: ఆద్యంతం.. ఉద్రిక్తం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ హైదరాబాద్లో మంగళవారం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సాయంత్రం 5 గంటలకు దిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు
సంజయ్ అరెస్ట్కు నిరసనగా భాజపా ర్యాలీ
దిల్లీ నుంచి జాతీయ అధ్యక్షుడి రాక
ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
కొవిడ్ నిబంధనలు పాటిస్తానన్న జె.పి.నడ్డా
సికింద్రాబాద్ ఎం.జి.రోడ్డులోని గాంధీ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా. చిత్రంలో ఆ పార్టీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్, రఘునందన్రావు, రామచంద్రరావు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, శంషాబాద్, సనత్నగర్, రెజిమెంటల్బజార్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ హైదరాబాద్లో మంగళవారం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సాయంత్రం 5 గంటలకు దిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను హైదరాబాద్ సంయుక్త కమిషనర్ కార్తికేయ కలిసి, ర్యాలీకి అనుమతి లేదని వివరించారు. అప్పటికే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా నేతలు కె.లక్ష్మణ్, జితేందర్రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, వందలమంది కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయంలోనే నడ్డాను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తానని, నిరసన తెలిపే హక్కును అడ్డుకోవద్దంటూ ఆయన చెప్పడంతో పోలీస్ అధికారులు వెళ్లిపోయారు.
విమానాశ్రయంలో తమ నేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం ఎదురైంది. ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానాశ్రయం లోపలికి వెళ్లడానికి యత్నించారు. ముందుగా ఇచ్చిన భాజపా శ్రేణుల జాబితాలో రాజాసింగ్ పేరు లేకపోవడంతో భద్రతాధికారులు ఆయనను అనుమతించలేదు. దీంతో ఆయన అరగంట పాటు బయటే ఉండి నడ్డాకు స్వాగతం పలికారు. బయటకు వచ్చిన నడ్డా.. కిషన్రెడ్డి కారులో సికింద్రాబాద్ బయలుదేరారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించినా.. దారులను దిగ్బంధించినా వారి కళ్లుగప్పి భాజపా కార్యకర్తలు వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో గాంధీచౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జె.పి.నడ్డా, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, డా.కె.లక్ష్మణ్, తరుణ్ఛుగ్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీ కాకుండా మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు ప్రకటించడంతో నడ్డా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి కొవ్వొత్తులను వెలిగించారు. ఆయన వెళ్లిన తర్వాత పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో భాజపా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
గాంధీ విగ్రహం వద్దకు చేరుకొన్న భాజపా శ్రేణులు
నేడు భాజపా స్వచ్ఛభారత్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కమలదళం బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛభారత్ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అరెస్సెస్ సమావేశాల కోసం అన్నోజిగూడ వెళ్లిన అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ఛుగ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 14 రోజుల నిరసన కార్యక్రమాలకు సమన్వయకర్తగా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ను నియమించారు. ఈ సందర్భంగా వివిధ రూపాల్లో రోజుకొక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!