Hamas: మార్చి.. ‘ఏమార్చి!’
ఇజ్రాయెల్పై దాడి ప్రణాళికను హమాస్ అత్యంత గోప్యంగా ఉంచింది. తాము పోరాడే స్థితిలో లేమని నమ్మించేందుకు కొన్ని నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఇజ్రాయెల్పై దాడికి హమాస్ వ్యూహం
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్పై దాడి ప్రణాళికను హమాస్ అత్యంత గోప్యంగా ఉంచింది. తాము పోరాడే స్థితిలో లేమని నమ్మించేందుకు కొన్ని నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతేకాదు.. ఈ దాడి ప్రణాళి కీలక హమాస్ సభ్యులకు తప్ప మూడో కంటికి తెలియనీయలేదు. దాడిలో పాల్గొన్న మిలిటెంట్లకు ఎందుకు శిక్షణ ఇస్తున్నారో కొన్ని గంటల ముందు వరకూ చెప్పలేదు. మరోవైపు కొన్నేళ్లుగా ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్, ఐడీఎఫ్ బలగాలను ఏమార్చే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది. ఈ విషయాన్ని హమాస్ నాయకుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. ఆ సంస్థకు చెందిన అలీ బరాఖే ప్రస్తుతం లెబనాన్లో ఆశ్రయం పొందుతున్నాడు. అతడు బీరుట్లో విలేకరులతో మాట్లాడుతూ.. హమాస్లోని అత్యంత సీనియర్ కమాండర్లలో అతి కొద్ది మందికే ఇజ్రాయెల్పై దాడి వ్యూహం తెలుసని పేర్కొన్నాడు. ‘జీరో అవర్ (దాడికి నిర్ణయించిన పక్కా సమయం) గురించి అతి తక్కువ మంది హమాస్ కమాండర్లకే తెలుసు. మా సెంట్రల్ కమాండ్, పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరూ గత వారం బీరుట్లో లేరు’ అని వెల్లడించాడు. లెబనాన్లోని హెజ్బొల్లా, ఇరాన్ గ్రూపులు గతంలో హమాస్కు సాయం చేసేవి. కానీ 2014 గాజా యుద్ధం నుంచి హమాస్ సొంతంగా రాకెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకుని మిలిటెంట్లకు శిక్షణ ఇస్తోందని అలీ బరాఖే వెల్లడించారు.
డబ్బు, వర్క్ వీసాలు అవసరమని నమ్మించి..
ఇజ్రాయెల్తో తాము పోరాటానికి సిద్ధంగా లేమనే సంకేతాలు గత కొన్నాళ్లుగా హమాస్ నుంచి వస్తున్నాయి. ఇటీవల చిన్న చిన్న పాలస్తీనా గ్రూపులకు, ఇజ్రాయెల్ సేనలకు మధ్య జరిగిన ఘర్షణల్లో హమాస్ తలదూర్చలేదు. పీఐజే, ఇతర సంస్థలు జరిపిన దాడుల్లో పాల్గొనేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దళాలు హమాస్పై కన్నేసి ఉంచినా అటువైపు నుంచి ఎటువంటి దాడి యత్నాలు లేకపోవడంతో సంతృప్తి చెందింది. అదే సమయంలో గాజా వాసులు అధిక ఆదాయం పొందేందుకు ఇజ్రాయెల్లో పని చేసేలా ఎక్కువ వర్క్ వీసాలు సాధించడంపైనే తమకు ఆసక్తి ఉందన్నట్లు టెల్ అవీవ్ను నమ్మించింది. దీనికి తోడు హమాస్ మరింత బాధ్యతా యుతంగా ఉందని తమను మిత్ర దేశాలు నమ్మించాయని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మాజీ సలహాదారు యాకోవ్ అమిడ్రోర్ మండిపడ్డారు. ‘మూర్ఖంగా మేం వారి మాటలు నమ్మి తప్పు చేశాం. ఇక ముందు ఇలాంటి తప్పులు జరగవు’ అని పేర్కొన్నారు.
ఉగ్రవాది ఇంటరాగేషన్తో ధ్రువీకరణ..
ఐడీఎఫ్ బలగాలు ఓ హమాస్ సాయుధ ముష్కరుడిని అరెస్టు చేశాయి. దాడికి 5 గంటల ముందే కీలక నేత తమకు దాడి చేస్తున్న ప్రాంతం గురించి చెప్పాడని ఆ సాయుధుడు వెల్లడించాడు. 1,000 మంది పాల్గొన్నారని తెలిపాడు. మొత్తం 15 చోట్ల సరిహద్దు కంచెను కత్తిరించినట్లు చెప్పాడు. తాము ఇజ్రాయెల్లో చొరబడే సమయానికి అక్కడ దళాలు లేకపోవడంతో ఆశ్చర్యపోయామని పేర్కొన్నాడు. తమతోపాటు ఉన్న సాయుధులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి.. రెండు గంటలపాటు నడిపించి గాజాలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అప్పుడూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదన్నాడు. అంతేకాదు.. తమ సాయుధుల ట్రక్కులు అత్యాధునిక ఆయుధాలతో ఉన్నాయని వెల్లడించాడు.
తొలుత ఐడీఎఫ్ కమ్యూనికేషన్లను తెంపి.. ఆపై అరాచకం
ఐడీఎఫ్ దక్షిణ గాజా డివిజన్పై తొలుత హమాస్ కమాండో యూనిట్ దాడి చేసింది. ఇది అక్కడి కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసింది. దీంతో ఇజ్రాయెల్ కమాండర్లు పరస్పరం సంప్రదించుకోవడం నిలిచిపోయింది. ఫలితంగా దళాలకు ఆదేశాలు రావడంలో జాప్యం జరిగింది. ఈ లోపు ముష్కర మూక సరిహద్దు ఊళ్లపై పడి రక్తపాతం సృష్టించింది. అంతేకాదు మరో 130 మందిని కిడ్నాప్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. -
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియమితులయ్యారు. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
Helicopter Crashes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాలు ఏవో చూద్దాం -
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
పారిస్లోని ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దుండగులు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లారు. -
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
తుర్కియే పంపిన అత్యాధునిక బైరక్తర్ అకిన్సి డ్రోన్లు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ గాలింపులో బాగా ఉపయోగపడ్డాయి. ప్రమాద స్థలం వివరాలను అత్యంత కచ్చితత్వంతో ఇరాన్కు అందజేశాయి. -
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రిని కోల్పోవడం ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. -
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చివరి క్షణాలకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పటి ఫొటో అది. -
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 212గా గుర్తించారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను షాక్కు గురిచేసింది. -
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దేశ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది. -
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
Iran president Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ధ్రువీకరించింది. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ