TS News: ధరణిలో అధికారుల అక్రమార్జన.. ఏ పని కావాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే!

ధరణి నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని సీసీఎల్‌ఏలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు పైరవీకారులకు పెద్ద పీటేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.

Published : 24 Apr 2024 09:38 IST

    తెలంగాణలో ధరణి సమస్యలతో పేద, మధ్య తరగతి రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. రైతుల సొంత భూములను సైతం నిషేధిత జాబితా నుంచి బయటకు తీసేందుకు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ధరణి నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని సీసీఎల్‌ఏలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు పైరవీకారులకు పెద్ద పీటేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు గత ప్రభుత్వంలో అన్నీతానై కీలక పదవిలో కొనసాగి పదవీ విరమణ పొందిన అధికారి పాత్రపైనా ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Tags :

మరిన్ని