Ongole: సీఎం జగన్‌ ఫొటోతో వైకాపా తాయిలాలు.. రూ.19.50లక్షల విలువైన చీరలు సీజ్‌!

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరలను ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒంగోలు మండలం గుత్తికొండవారి పాలెంలో ఓ గోదాములో ఈ చీరలను స్వాధీనం చేసుకున్నారు. 18 బండెల్స్‌లో దాదాపు 1800 చీరలు ఉన్నాట్టు అధికారులు తెలిపారు. చీరల పెట్టెలమీద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయని చెప్పారు. చీరల విలువ దాదాపు రూ.19.50లక్షలు ఉంటుందని జీఎస్టీ అధికారులు అంచనా వేశారు. గోదాంలో ఉన్న చీరలను సీజ్‌ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

Published : 27 Mar 2024 21:44 IST

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరలను ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒంగోలు మండలం గుత్తికొండవారి పాలెంలో ఓ గోదాములో ఈ చీరలను స్వాధీనం చేసుకున్నారు. 18 బండెల్స్‌లో దాదాపు 1800 చీరలు ఉన్నాట్టు అధికారులు తెలిపారు. చీరల పెట్టెలమీద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయని చెప్పారు. చీరల విలువ దాదాపు రూ.19.50లక్షలు ఉంటుందని జీఎస్టీ అధికారులు అంచనా వేశారు. గోదాంలో ఉన్న చీరలను సీజ్‌ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 

Tags :

మరిన్ని