Balakrishna: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి బాలకృష్ణ పరామర్శ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి ఆద్య కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పరామర్శించారు. పట్టణంలోని పట్టుగుళ్ల మార్కెట్ రోడ్డులో గత ఏడాది నవంబర్ నెలలో ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో చిన్నారి ఆద్య(8) మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. చిన్నారి ఆద్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ.. ఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Published : 10 Jan 2024 19:29 IST

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి ఆద్య కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పరామర్శించారు. పట్టణంలోని పట్టుగుళ్ల మార్కెట్ రోడ్డులో గత ఏడాది నవంబర్ నెలలో ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో చిన్నారి ఆద్య(8) మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. చిన్నారి ఆద్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ.. ఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags :

మరిన్ని