Vande Bharat Express: పట్టాలెక్కిన విశాఖ- భువనేశ్వర్ వందేభారత్ రైలు
తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి మరో వందేభారత్ రైలు పట్టాలెక్కింది. విశాఖ- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైలుకు విజయనగరం స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. విశాఖ నుంచి రైలు విజయనగరానికి చేరుకొగానే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రఘువర్మ, పలువురు భాజపా నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. రైలులోని అధునాతన సౌకర్యాలను పరిశీలించారు.
Published : 12 Mar 2024 16:09 IST
Tags :