YSRCP: వీఆర్వోపై చేయి చేసుకున్న వైకాపా నేత
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థలం ఆక్రమణ అడ్డుకున్నాడని 26వ వార్డు సచివాలయం వీఆర్వోపై ఓ వైకాపా (YSRCP) నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశాడు. ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని వైకాపా నాయకుడు ఆక్రమించి కంచె వేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వీఆర్వో అధికారులతో కలిసి ఆ కంచెను తొలగించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకుడు సచివాలయంలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. ఘటనపై బాధిత వీఆర్వో ధర్మవరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Updated : 19 Mar 2024 15:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు