YSRCP: వీఆర్వోపై చేయి చేసుకున్న వైకాపా నేత

  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థలం ఆక్రమణ అడ్డుకున్నాడని 26వ వార్డు సచివాలయం వీఆర్వోపై ఓ వైకాపా (YSRCP) నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని వైకాపా నాయకుడు ఆక్రమించి కంచె వేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వీఆర్వో అధికారులతో కలిసి ఆ కంచెను తొలగించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకుడు సచివాలయంలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. ఘటనపై బాధిత వీఆర్వో ధర్మవరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated : 19 Mar 2024 15:12 IST

  శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థలం ఆక్రమణ అడ్డుకున్నాడని 26వ వార్డు సచివాలయం వీఆర్వోపై ఓ వైకాపా (YSRCP) నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని వైకాపా నాయకుడు ఆక్రమించి కంచె వేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వీఆర్వో అధికారులతో కలిసి ఆ కంచెను తొలగించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకుడు సచివాలయంలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. ఘటనపై బాధిత వీఆర్వో ధర్మవరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని