బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 09:30 IST

మోదీ, బిల్‌గేట్స్‌.. ‘చాయ్‌ పే చర్చ’

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్నారు. ఏఐ విసురుతున్న సవాళ్ల గురించి వారు చర్చించారు. ఇది ఎంతో శక్తిమంతమైంది అయినా.. పలువురి చేతుల్లో దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డారు. డీప్‌ ఫేక్‌ ద్వారా తన గొంతును కూడా అనుకరించినట్లు మోదీ చెప్పారు. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. జీ 20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించినట్లు వివరించారు. తమిళనాడులో పర్యటకుల కోసం పర్యావరణహితమైన హైడ్రోజన్‌ పవర్డ్‌ బోట్‌ను ప్రారంభించినట్లు వివరించారు. తాను ధరించిన జాకెట్‌ పునరుత్పాదక పద్ధతిలో తయారు చేసిందని పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు