శివ మహిమ స్తోత్రం
కాలం ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడికి ఎన్నో రూపాలు, ఎన్నో విలాసాలు, ఎన్నో విన్యాసాలు. మన జీవితంలో ప్రతి అంశం, ప్రతి అందం, ప్రతి ఆనందం, ప్రతి అనుభవం, ప్రతి స్వప్నం, ప్రతి సత్యం- అన్నీ పరమేశ్వరుడి నామాలుగా, రూపాలుగా మనల్ని స్పర్శిస్తున్నాయి. భారతీయ భక్తి వాఙ్మయంలో శివ స్తోత్రాలకు విశిష్టస్థానం ఉంది. వాటిలో అగ్రగణ్యమైనది...
కాలం ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడికి ఎన్నో రూపాలు, ఎన్నో విలాసాలు, ఎన్నో విన్యాసాలు. మన జీవితంలో ప్రతి అంశం, ప్రతి అందం, ప్రతి ఆనందం, ప్రతి అనుభవం, ప్రతి స్వప్నం, ప్రతి సత్యం- అన్నీ పరమేశ్వరుడి నామాలుగా, రూపాలుగా మనల్ని స్పర్శిస్తున్నాయి. భారతీయ భక్తి వాఙ్మయంలో శివ స్తోత్రాలకు విశిష్టస్థానం ఉంది. వాటిలో అగ్రగణ్యమైనది ‘శివమహిమ్నః స్తోత్రం!’
‘పరమేశ్వరా! పండితులు నిన్ను సూర్యుడివి, చంద్రుడివి, వాయువ్వి, అగ్నివి, నీరువి, ఆకాశానివి, భూమివి, ప్రత్యగాత్మవి అని చెబుతూ ఈ చరాచర సృష్టిలో నువ్వేది కాదో తెలుసుకోలేకపోతున్నారు’ అంటోంది శివమహిమ్నః స్తోత్రం. ఈ శివస్తవకర్త పుష్పదంతుడు. పుష్పదంతుణ్ని పురాణ పురుషుడిగా పెక్కుమంది పండితులు భావిస్తున్నారు. పద్మ పురాణంలో ఇతడి ప్రసక్తి ఉంది. ‘సకల గంధర్వులకు ప్రభువైన పుష్పదంతుడు దేవతలకు కూడా దైవమైన పరమేశ్వరుడి సేవకుడు. ఆ శివుడి ఆగ్రహానికి గురై, తన మహిమను కోల్పోయి, ఈ విధంగా శివుణ్ని స్తుతిస్తున్నాడు’ అని ఈ స్తోత్రంలోని ఒక శ్లోకంలో స్తోత్ర రచనకుగల పూర్వ రంగాన్ని పుష్పదంతుడు పేర్కొన్నాడు.
గంధర్వుడైన పుష్పదంతుడు శివభక్తుడు. ఆకాశయానం, ఎవరికీ కనబడకుండా సంచరించడం వంటి దివ్యశక్తులు గలవాడు. ఇతడికి గల సంగీత వైదుష్యం వల్ల ఇంద్రుడు తన కొలువులో సంగీత విద్వాంసుడిగా నియమించాడు. పుష్పదంతుడు ఆకాశంలో అదృశ్యంగా సంచరిస్తూ ఒకనాడు చిత్రరథుడనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శించాడు. ఆ రాజు కూడా గొప్ప శివభక్తుడు. శివార్చన కోసం ఒక పెద్ద పూలతోట పెంచుతుంటాడు. రమణీయమైన ఆ ఉద్యానాన్ని తిలకించిన పుష్పదంతుడు దాని సౌందర్యానికి ఆకర్షితుడై ఆ తోటలోకి ప్రవేశించి పూలు కోస్తుంటాడు. అతడెవరికీ కనిపించకపోవటం వల్ల పుష్పాలు ఎలా మాయమవుతున్నాయో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇలా రెండు రోజులు జరిగింది. తాము రేయింబవళ్లూ వెయ్యి కళ్లతో సంరక్షిస్తున్నప్పటికీ పూలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలియడంలేదని రక్షక భటులు రాజుకు విన్నవించుకున్నారు. రాజు ఆలోచించి చెట్ల కింద మారేడు దళాల్ని విస్తృతంగా వెదజల్లమన్నాడు. మారేడు శివుడికి ప్రీతికరమైనవి. ఆ పత్రాల్ని కాలితో తొక్కితే పరమేశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని చిత్రరథుడు భావించాడు.
పుష్పదంతుడు యథాప్రకారం తోటలోకి ప్రవేశించి పూలు కోస్తాడు. చిత్రరథుడు భావించినట్లుగానే తెలియకుండా మారేడు ఆకుల్ని తొక్కాడు. ఆ క్షణంలో పరమేశ్వరుడి ధ్యానం చెదిరింది. గంధర్వుడైన పుష్పదంతుడు చౌర్యానికి పాల్పడటం, బిల్వ పత్రాల్ని తొక్కడం దోషంగా భావించి అతడి దివ్యశక్తుల్ని నశింపజేస్తాడు. ఆ కారణంగా పుష్పదంతుడు కావలివారి కంటపడి కారాగారబద్ధుడవుతాడు. తన అపచారానికి పశ్చాత్తాపంతో పరమ శివుడి అనుగ్రహం కోరుతూ ఈ స్తోత్రం రచిస్తాడు. శివుడు ఆ స్తుతికి సంతోషించి పుష్పదంతుడికి తిరిగి దివ్యశక్తుల్ని అనుగ్రహిస్తాడు. చిత్రరథుడు అతణ్ని క్షమించి విడిచిపెడతాడు. తరతరాలుగా ప్రచారంలో ఉన్న గాథ ఇది.
కొన్ని ప్రతుల్లో 39 శ్లోకాలు, కొన్ని ప్రతుల్లో 46 శ్లోకాలు ఈ స్తోత్రంలో కనిపిస్తున్నాయి. మధుసూదన సరస్వతి దీనికి వ్యాఖ్య రచించడంవల్ల దీని ప్రశస్తి వెల్లడి అవుతున్నది. అనంతర కాలంలో వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి విద్వాంసులు ఈ స్తోత్రానికి రమణీయ వ్యాఖ్యలు రచించారు. ఆదిశంకరుల ‘శివానందలహరి’తో సమానస్థాయి గల స్తోత్రరాజం ఇది. మధ్యప్రదేశ్లో ఓంకార క్షేత్రంలోని అమరేశ్వరాలయంలో మాంధాతృ మండపం గోడపై ఈ స్తోత్రం లిఖితమై ఉంటుంది. సోమనాథ్, ఉజ్జయినీ, కేదారనాథ్ మొదలైన జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివుడికి ఈ స్తోత్రంతోనే అభిషేకాలు చేస్తారు. రామకృష్ణ పరమహంస నిత్యం ఈ స్తోత్రం పారాయణం చేసేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల