Andhra News: ఏపీలో సినిమా టికెట్ ధరల ఖరారు
ఆంధ్రప్రదేశ్లోని సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది.
గరిష్ఠం రూ.250, కనీస ధర రూ.20
షరతులతో ఐదో ఆటకు అనుమతి
20శాతం షూటింగ్ ఏపీలో జరిగితేనే
100 కోట్ల సినిమాకు ప్రత్యేక ధరలు
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్ ఏసీ, థియేటర్లు ఉన్న ప్రాంతాలు, వాటిలో కల్పించే సదుపాయాల ఆధారంగా టికెట్ల ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. టికెట్ల ధరల్లో జీఎస్టీ మినహా నిర్వహణ ఛార్జీలు ఏసీకి రూ.5, నాన్ ఏసీకి రూ.3తోపాటు ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు కలిసి ఉంటాయి. ఏసీ థియేటర్లలో రిక్లెయినర్ సౌకర్యం అందుబాటులో ఉన్నచోట టికెట్ ధర రూ.250కి అనుమతించింది. కొన్ని నిబంధనలతో 5వ ఆట నిర్వహణకు వెసులుబాటు కల్పించింది.
* ఎక్కువ ధరకు టికెట్ కొని సినిమా చూడలేనివారి కోసం ప్రతి థియేటర్లోని మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను ప్రీమియం కాని (నాన్ప్రీమియం) కేటగిరీగా కేటాయించాలి.
* ఎయిర్కూల్ థియేటర్లను సింగిల్ కేటగిరీ ఏసీ థియేటర్ల జాబితాలో విలీనం చేశారు. ఇవి ఏసీ లేదా నాన్ ఏసీ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు రెండేళ్ల వరకు అనుమతిస్తారు.
* ప్రత్యేక థియేటర్లను ప్రత్యేకంగా వర్గీకరించారు. 2కే ప్రొజెక్షన్, ఇతర మౌలిక సదుపాయాలు, హై ఎండ్ సీటింగ్, అంతకంటే ఎక్కువ డిజిటల్ సరౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలతో మల్టీప్లెక్స్ థియేటర్లకు సమానంగా అనేక సింగిల్ థియేటర్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రత్యేక కేటగిరీ థియేటర్ల గుర్తింపు కోసం నోడల్ అధికారిగా ఆ జిల్లా సంయుక్త కలెక్టర్తో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, అవసరమైన మార్గదర్శకాలను విడిగా జారీ చేస్తారు.
* ఎక్కువ బడ్జెట్ సినిమాలతో పోటీపడే చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు షరతులతో ఐదు షోలకు ప్రభుత్వం అనుమతించింది. తక్కువ బడ్జెట్ సినిమా విడుదలైనప్పుడల్లా పండగ రోజు సహా ఏ రోజైనా వాటిని ప్రదర్శించడానికి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక ఆట తప్పనిసరిగా వాటికి రిజర్వు చేయాలనే షరతుతో 5 ఆటలకు అనుమతించింది.
* కథానాయకుడు, నాయిక, దర్శకుడి పారితోషికాన్ని మినహాయించి రూ.100 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయంతో తీసే చిత్రాలను సూపర్ హై బడ్జెట్ చిత్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి చిత్రాలు కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగి ఉంటేనే.. విడుదలైన మొదటి పది రోజులకు ప్రత్యేక ధరలను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.
* తక్కువ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్, సూపర్ హై బడ్జెట్ సినిమాలకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది.
చిరంజీవి కృతజ్ఞతలు
సినిమా టికెట్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్కు ప్రముఖ నటుడు చిరంజీవి ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేలా, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్కు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు 5వ షోకు అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడుతుంది. ఇందుకు సహకరించిన మంత్రి పేర్ని నానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
దాల్మియాకు చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్, పునీత్ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.