రైతు మరణాలపై భగ్గు
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లాలో 144వ సెక్షన్ను విధించారు. అంతర్జాల సేవలనూ నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ,
నిరసనలతో అట్టుడికిన యూపీ, దిల్లీ, పంజాబ్, హరియాణా
దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విపక్షాల ఆందోళనలు
లఖింపుర్ ఖేరికి వెళ్లకుండా విపక్ష నేతల అడ్డగింత
ప్రియాంక, అఖిలేశ్ మరికొందరి గృహనిర్బంధం
మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు
మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన యోగి సర్కారు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ
లఖింపుర్, ఈనాడు-లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లాలో 144వ సెక్షన్ను విధించారు. అంతర్జాల సేవలనూ నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఘటనను నిరసిస్తూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలు భాజపాపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్ష నేతలు రాజకీయ పర్యటనలు చేస్తున్నారని యోగి సర్కారు ఆరోపించింది.
ఉత్తర్ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్పుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు మృతిచెందారు.
రైతులతో అధికారుల చర్చలు
లఖింపుర్ ఖేరి ఉద్రిక్తంగా మారడంతో... ఉత్తర్ప్రదేశ్ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ అవస్థి వెల్లడించారు. గాయపడ్డవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై మొత్తం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు. ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాగా, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని లఖింపుర్ ఖేరిలో 144వ సెక్షన్ను అమలు చేస్తున్నట్టు ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని, రైతు సంఘాల నేతలను మాత్రం అడ్డుకోబోమన్నారు.
అన్ని దారులు మూసివేత...
బయటివారు లఖింపుర్ ఖేరికి రాకుండా జిల్లా సరిహద్దుల్లో అన్ని రహదారులను మూసివేశారు. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. అక్కడి శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను మోహరిస్తోంది.
మంత్రిని తొలగించాలి: రైతు సంఘాల డిమాండ్
అజయ్ మిశ్రను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. మరోవైపు- లఖింపుర్ ఖేరి ఘటనకు నిరసనగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా... అన్ని రాష్ట్రాల జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టినట్టు వెల్లడించింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ సోమవారం ఉదయాన్నే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించబోమని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలెవరూ ఉత్తర్ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించవద్దని మరో నేత నరేశ్ టికాయిత్ హెచ్చరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ తాను, తన కుమారుడు లేమని మంత్రి చెప్పడాన్ని కొందరు రైతులు ఖండించారు. మంత్రి కుమారుడు ఆశిష్ స్వయంగా తుపాకీతో బెదిరించినట్టు ఆరోపించారు.
ఈ దేశం రైతులది... భాజపాది కాదు: ప్రియాంక
లఖ్నవూ నుంచి లఖింపుర్ ఖేరికి బయల్దేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని... సితాపుర్ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సమీపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. ఘటనకు నిరసనగా ఆమె అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. చీపురు పట్టి, తనను ఉంచిన గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అంతకుముందు ప్రియాంక మరో వీడియోలో మాట్లాడారు. ‘‘ఈ దేశం రైతులది. భాజపాది కాదు. దగాపడ్డ రైతు కుటుంబాల బాధను పంచుకోవడానికి వెళ్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ప్రియాంకతో పాటు ఆమె వెంట ఉన్న మరికొందరిపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
అంతిమ విజయం రైతులదే: రాహుల్గాంధీ
న్యాయపోరాటంలో అంతిమంగా అన్నదాతలే విజయం సాధిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. ‘‘ప్రియాంక! నువ్వు వెనక్కి తగ్గవని నాకు తెలుసు. నీ ధైర్యాన్ని చూసి వారు భయపడుతున్నారు. న్యాయం కోసం జరుగుతున్న అహింసాయుత పోరాటంలో చివరికి అన్నదాతలే విజయం సాధిస్తారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు సంఘీభావంగా, ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం సమీపాన, ఉత్తర్ప్రదేశ్ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పంజాబ్లో రాజ్భవన్ వద్ద పీసీసీ అధ్యక్షుడు నవ్జోత్సింగ్ సిద్ధూ, పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
ఆగ్రహం కట్టలుతెంచుకున్న ఎస్పీ కార్యకర్తలు...
లఖింపుర్ ఖేరికి వెళ్లకుండా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను పోలీసులు ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో నేతలతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. మంత్రి కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఎస్పీ కార్యకర్తలు... అక్కడికి సమీపంలోని గౌతంపల్లి పోలీస్స్టేషన్ వద్ద పోలీసు జీపునకు నిప్పు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర మిశ్ర, ఆప్ నేతలు సంజయ్ సింగ్, శివపాల్ యాదవ్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారి, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తదితరులను కూడా పోలీసులు నిరోధించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చంద్రజీత్ సింగ్ చన్ని, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్లను అనుమతించవద్దని లఖ్నవూ విమానాశ్రయ అధికారులను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
అన్నదాతలతో సున్నితంగా వ్యవహరించాలి: వరుణ్ గాంధీ
లఖింపుర్ ఖేరి ఘటనపై భాజపా ఎంపీ వరుణ్గాంధీ తీవ్రంగా స్పందించారు. రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలి. మృతిచెందిన రైతు కుటుంబాలకు రూ.కోటి చొప్పన పరిహారమివ్వాలి. వారి మృతికి కారణమైన వారిపై హత్యానేరం కింద కేసులు పెట్టాలి. ఆందోళన చేస్తున్న అన్నదాతలు మన తోటి పౌరులే. వారితో అత్యంత సున్నితంగా, సహనంతో మెలగాలి’’ అని ఆయన పేర్కొన్నారు. వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిభిత్ నియోజకవర్గం లఖింపుర్ ఖేరికి సమీపంలోనే ఉండటం గమనార్హం.
అక్కడే ఉంటే నేనూ చనిపోయేవాడిని
భాజపా కార్యకర్తలకూ పరిహారం చెల్లించాలి: అజయ్ మిశ్ర
రైతుల దాడిలో మరణించిన భాజపా కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు. దాడి ఘటనపై సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. లఖింపుర్ ఖేరిలో భాజపా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడి చేశారని, అక్కడే ఉంటే తాను కూడా మరణించేవాడినని మంత్రి అన్నారు. రైతు ఆందోళనల ముసుగులో కాంగ్రెస్, ఎస్పీలు రాజకీయాలు చేస్తున్నాయని భాజపా ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ విమర్శించారు. ఎస్పీ కార్యకర్తలు పాల్గొనడం వల్లే అక్కడ ఘర్షణలు చెలరేగాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ సీఎంలు లఖింపుర్ ఖేరిలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల... మిగతా పార్టీల ముఖ్యమంత్రులు పర్యటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి’’ అని భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM