బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ.60,740 కోట్ల ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాల నిమిత్తం చెల్లించిన మొత్తంలో... రూ.60,740.83 కోట్ల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల (చేబదుళ్లు) చెల్లింపుతోపాటు
రుణాలు చెల్లించేందుకు వెచ్చించిన ప్రభుత్వం
అది అధీకృత ఖర్చు కాదని స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాల నిమిత్తం చెల్లించిన మొత్తంలో... రూ.60,740.83 కోట్ల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల (చేబదుళ్లు) చెల్లింపుతోపాటు ముందు సంవత్సరం తీసుకున్న రూ.362 కోట్లు కలసి ఉందని, ఈ వ్యయానికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపుల్లేవని కాగ్ తెలిపింది. ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15,991.85 కోట్ల అనుబంధ పద్దుల్ని 2020 జూన్లో శాసనసభ ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టింది. ఆ మొత్తాన్ని చట్టసభల ఆమోదం పొందకుండానే 2020 మార్చి 31లోగా ప్రభుత్వం ఖర్చు చేసేసిందని తెలిపింది. అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంది. అది చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్పై నియంత్రణను బలహీనపరుస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించినట్టవుతుందని పేర్కొంది. ‘దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ను కారణంగా చూపింది. 2020 మార్చి చివరిలో లాక్డౌన్ విధించిన మాట వాస్తవమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆర్డ్నెన్స్ ద్వారా ఆమోదం పొందింది. 2019-20 సంవత్సర అనుబంధ పద్దుల వివరాల్ని దానిలో చేర్చలేదు’ అని తెలిపింది. బడ్జెట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ లోటుపాట్లను కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...!
కొన్ని శాఖల్లో మిగులు... కొన్ని శాఖల్లో తగులు
* వాస్తవికత లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు, పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాల అమలులో సామర్థ్య లోపం, బలహీనమైన అంతర్గత నియంత్రణల కారణంగా వివిధ అభివృద్ధి కారక అంశాలకు అవసరమైనదానికంటే తక్కువ కేటాయింపులు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని శాఖల్లో ఎక్కువ నిధులు మిగిలి పోతున్నాయి.
* శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేస్తున్న సందర్భాలు పునరావృతమవుతున్నాయి. ఇది శాసనసభ అభీష్ఠానికి విరుద్ధం.
* 2019-20 బడ్జెట్లో వోటెడ్ వ్యయానికి రూ.2,18,148 కోట్లు, ఛార్జ్డ్ వ్యయానికి రూ.10,130 కోట్లు కేటాయించగా... వోటెడ్ వ్యయంలో రూ.66,725 కోట్లు మిగలగా, ఛార్జ్డ్ విభాగంలో రూ.67,082 కోట్లు అదనంగా ఖర్చు చేశారు.
* రెవెన్యూ వ్యయంగా ఖర్చు చేసిన రూ.1,006 కోట్లను మూలధన వివరణాత్మక పద్దుల కింద తప్పుగా వర్గీకరించారు.
* అనుబంధ బడ్జెట్ నిధుల కోసం వివిధ శాఖలు అధిక మొత్తంలో ప్రతిపాదనలు ప్రవేశపెడుతున్నాయి. కానీ... కొన్ని సందర్భాల్లో అనుబంధ బడ్జెట్లో చేసిన కేటాయింపులే కాకుండా, తొలి బడ్జెట్ మొత్తాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాయి. దానివల్ల నిధులు అవసరమైన ఇతర పథకాలకు అవసరమైనంత వెచ్చించడం సాధ్యపడటం లేదు. 2019-20 బడ్జెట్లో అనుబంధ బడ్జెట్ కేటాయింపుల్లో రూ.3,664 కోట్లు వినియోగించలేదు.
* వివిధ శాఖలకు రూ.1,116 కోట్ల అనవసర, పునః కేటాయింపులు చేశారు.
* భారీ, మధ్య తరహా నీటిపారుదల, రోడ్లు-భవనాల శాఖలకు కేటాయించిన గ్రాంట్లలో ముఖ్యంగా మూలధన వ్యయానికి సంబంధించి తక్కువ బడ్జెట్ వినియోగించడంతో రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభావం పడింది. విద్య, వైద్య ఆరోగ్యం గ్రాంట్లను తక్కువగా వినియోగించడంతో మానవ వికాసం, జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడింది. అత్యవసరమైన, మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడే గ్రాంట్లను తక్కువగా వినియోగించడాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలించి తగిన దిద్దుబాటు చర్యల్ని సత్వరమే చేపట్టాలి.
ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పనితీరు బడ్జెట్ని రూపొందిస్తోంది. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు... ముందు సంవత్సరం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యాల్ని ఏ మేరకు సాధించారన్న వివరాల్ని సభలో ప్రవేశపెట్టడం లేదు. 2019-20 బడ్జెట్ కూడా దీనికి మినహాయింపు కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.