మనది ఉద్యోగ మిత్ర ప్రభుత్వమని చెప్పండి
‘రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గింది. రుణాలు తీసుకునేందుకు పరిమితులున్నాయి. ఎక్కువగా అప్పుచేసే అవకాశమూ లేదు.
వారి డిమాండ్లు తీర్చాలంటే ఏదైనా పెద్ద పథకం ఆపాలి!
తెదేపా వలలో పడకుండా చూడండి
మంత్రిమండలి భేటీలో సీఎం జగన్ దిశానిర్దేశం
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గింది. రుణాలు తీసుకునేందుకు పరిమితులున్నాయి. ఎక్కువగా అప్పుచేసే అవకాశమూ లేదు. ఆదాయం పెరిగితేనే అప్పు పరిమితీ పెరుగుతుంది. ఈ ఇబ్బందులే లేకపోతే ఉద్యోగులకు చేయగలిగినంతా చేస్తాం కదా? వారితో మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని సీఎం జగన్ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ‘ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేవాళ్లమే. అవి తీర్చాలంటే ఏదో ఒక పెద్ద పథకం ఆపాల్సి వస్తుంది. కానీ, మనం ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నాం కదా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. శుక్రవారం మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనలపై సీఎం అరగంట పాటు మాట్లాడారని సమాచారం. సుమారు 15 పాయింట్లతో కూడిన సమాచారాన్ని మంత్రులకు అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం చేసిన మార్గనిర్దేశం ఇదీ..
ఎక్కడికక్కడ మాట్లాడండి
‘మీకిచ్చిన సమాచారాన్నే ఎమ్మెల్యేలందరికీ ఇస్తాం. ఊళ్లలో ఎక్కడికక్కడ ఉద్యోగులతో మాట్లాడండి. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాకపోతే, వారికి ఇవన్నీ చేసేదా అనే విషయాన్ని వివరించండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే 27శాతం ఐఆర్ ఇవ్వడంతో రూ.17,900 కోట్ల భారం పడింది. ఐఆర్ ఇవ్వకపోయి ఉంటే, ఆ సుమారు రూ.18వేల కోట్లు వేరే పథకాలకు వాడుకుని ఉండేవాళ్లం కదా? ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఖజానాపై రూ.10,240 కోట్ల భారం పడుతున్నా పీఆర్సీ ఇచ్చాం. జీతాలు తగ్గుతున్నాయంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. మనం ఇచ్చిన పీఆర్సీ శాతాల స్థాయి హెచ్ఆర్ఏనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వస్తోంది. ఐదారు రాష్ట్రాల్లోనూ ఇంతే ఇస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధి కలగదా? స్మార్ట్ టౌన్షిప్లలో 10శాతం కేటాయించనున్నాం, 20శాతం రాయితీ ఇస్తున్నాం.
చంద్రబాబు చేసిన నియామకాలెన్ని?
‘చంద్రబాబు ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? మన ప్రభుత్వం తొలి ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో కలిపాం. ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఏవో, యానిమేటర్లు ఇలా అందరికీ జీతాలు పెంచాం. ఇది ఉద్యోగ శ్రేయస్సు కాదా? చంద్రబాబు, తెదేపా ట్రాప్లో ఉద్యోగులు పడకుండా చూడండి’ అని వివరించారు.
సమన్వయం చేసేందుకు కమిటీ
రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రధాన నేతలతో మాట్లాడేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!