SSA: గుత్తేదారుకే కానుక!
రాష్ట్ర ప్రభుత్వం ‘విద్యాకానుక’ కింద అందించే బూట్లు, ఏకరూప దుస్తుల ధరలు గుత్తేదార్లు రింగ్ కావడంతో భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే సాక్సులతో కలిపి జత బూట్లకు అదనంగా రూ.51, ఏకరూప దుస్తులకు రూ.155 చొప్పున పెరిగింది. ప్రభుత్వంపై రూ.92 కోట్లు అదనంగా భారం పడుతోంది.
గతేడాది కంటే రూ.92 కోట్లు అదనం
అంతా కుమ్మక్కై ఎక్కువకు టెండర్
అయినా ఖరారు చేస్తున్న సర్వశిక్షా అభియాన్
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘విద్యాకానుక’ కింద అందించే బూట్లు, ఏకరూప దుస్తుల ధరలు గుత్తేదార్లు రింగ్ కావడంతో భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే సాక్సులతో కలిపి జత బూట్లకు అదనంగా రూ.51, ఏకరూప దుస్తులకు రూ.155 చొప్పున పెరిగింది. ప్రభుత్వంపై రూ.92 కోట్లు అదనంగా భారం పడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో విద్యార్థులకు విద్యాకానుక కింద 3 జతల ఏకరూప దుస్తులు, బ్యాగ్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందిస్తున్నారు. వీటి సేకరణకు సమగ్ర శిక్ష అభియాన్ టెండర్లు నిర్వహిస్తోంది. గతేడాది వరకు బూట్లకు రాష్ట్రం మొత్తానికి ఒకే టెండర్ పిలవగా.. ఈసారి రెండు జోన్లుగా విడగొట్టారు. రివర్స్ టెండరింగ్ సైతం నిర్వహించారు. గతేడాది జత బూట్లను రూ.124 చొప్పున అందించగా, ఈసారి కూడా అదే సంస్థ సుమారు రూ.175కు కాంట్రాక్టు దక్కించుకుంది. కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న 2020లోనూ జత బూట్లు రూ.160 చొప్పున అందించారు. 2021లో రూ.124కే సరఫరా చేయడంతో ప్రభుత్వానికి నిధులు భారీగా మిగిల్చినట్లు సమగ్రశిక్ష అభియాన్ అప్పట్లో చెప్పుకొంది. ఈసారి ఏకంగా ఒక్కో జతపై రూ.51 అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45.80 లక్షల మంది విద్యార్థులున్నారు. రూ.51 ఎక్కువగా చెల్లించడం వల్ల కేవలం బూట్లకే ప్రభుత్వంపై రూ.23.35 కోట్ల అదనపు భారం పడుతోంది. గత రెండేళ్లు బూట్లను పాఠశాలలకు సరఫరా చేసేటప్పుడు నాణ్యత తనిఖీ కోసం చెన్నై, దిల్లీ ప్రయోగశాలలకు పంపించేవారు. ఈసారి టెండర్లకు ముందే తనిఖీ చేయించగా, బాటాతో పాటు మరో కంపెనీవి నాణ్యంగా లేవంటూ పక్కనపెట్టారు.
కొలతల తేడాతో సమస్యే..
బూట్ల సరఫరా క్షేత్రస్థాయిలో అస్తవ్యస్తంగా మారుతోంది. విద్యార్థుల పాదాల కొలతల్లో తేడా కారణంగా సరిగా సరిపోవడం లేదు. గుత్తేదార్లు ఒకేసారి భారీగా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత సైజులపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. సైజులు సరిగా లేవని పాఠశాలల నుంచి వెనక్కి పంపితే తిరిగి రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొలతలు సరిపోలేదని గతేడాది కొందరు విద్యార్థులకు బూట్లే ఇవ్వలేదు. కొత్తగా కొలతలు తీసుకొని, పాతవాటిని మార్చి ఇస్తామని చెబుతున్నా ఇదీ అమలు కావడం లేదు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు చెప్పులతోనే వస్తున్న సంగతి ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ బయటపడింది. విద్యాకానుక పంపిణీ సమయంలో వీటిపై హడావుడి చేసి, తర్వాత మూలకు పడేస్తున్నారు. కేవలం విశాఖపట్నం జిల్లాలోనే 10వేల బూట్లు సైజుల్లో తేడా కారణంగా వెనక్కి ఇచ్చేయగా, వాటికి బదులుగా కొత్తవి రాలేదు.
న్యాయసమీక్షకు వెళ్లకుండా..
3 జతల ఏకరూప దుస్తుల సరఫరాకు గతేడాది సగటున రూ.625 వరకు వెచ్చించగా, ఈసారి టెండర్లో రూ.775కు పెంచినట్లు తెలిసింది. రూ.వంద కోట్లకు మించే టెండర్ను న్యాయసమీక్షకు పంపించాలన్న నిబంధనను తప్పించుకునేందుకు ఈ టెండర్లను 4 జోన్లుగా విభజించి, ఒక్కోదాని విలువ తగ్గించారు. ఎస్ఎస్ఏ మొదట 3 జతలకు రూ.700 ధర నిర్ణయించగా గుత్తేదార్లు రూ.750 కోట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ టెండర్లు రద్దు చేశారు. రెండోసారి ధరను రూ.750వరకు పెంచినట్లు తెలిసింది. దీనిపై గుత్తేదార్లు 10శాతం అధికంగా వేయగా, తర్వాత నిర్వహించిన రివర్స్ టెండర్లు, బేరాల్లో సుమారు 4శాతం ఎక్కువకు అంగీకరించారు. దీంతో నాలుగు జోన్లలో కలిపి సగటున రూ.775కు ఖరారు చేశారు. 45.80లక్షల మంది విద్యార్థుల లెక్కన రూ.68.70 లక్షలు అదనంగా చెల్లించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.