27 నుంచి మహిళా అభ్యర్థులకు ‘అగ్నివీర్‌’ నియామక ర్యాలీ

మహిళా మిలటరీ పోలీసు (అగ్నివీర్‌) నియామకాల ఎంపిక ప్రక్రియ ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు సైనిక అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated : 25 Nov 2022 06:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా మిలటరీ పోలీసు (అగ్నివీర్‌) నియామకాల ఎంపిక ప్రక్రియ ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు సైనిక అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తమిళనాడులోని వేలూరు జిల్లా క్రీడా ప్రాంగణంలో అగ్నివీర్‌ నియామక ర్యాలీని భారత సైన్యం నిర్వహిస్తోంది. ఆగస్టులో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డులు, సంబంధిత విద్యార్హత పత్రాలు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని.. మధ్యవర్తులు, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని