Venkaiah Naidu: తెలుగువారి ఠీవి.. వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది.
ఉపరాష్ట్రపతి పదవి సహా ఆయన్ను వరించిన హోదాలెన్నో
కేంద్రమంత్రిగా, భాజపా అధ్యక్షుడిగా రాణింపు
దేశంలోని ప్రతిజిల్లాలో పర్యటించిన బహుదూరపు బాటసారి
అందరికీ ఇష్టుడిగా, అజాతశత్రువుగా ఖ్యాతి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత రెండో పౌరపురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, భాజపా రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్ధాటితో ఆసేతుహిమాచలం అభిమానధనాన్ని సొంతం చేసుకున్న తెలుగునేత ఈయనే. దేశంలో ఉన్న అన్ని జిల్లాలనూ కనీసం ఒక్కసారైనా చుట్టేసి ఈ దేశం మట్టివాసనను ఆఘ్రాణించిన బహుదూరపు బాటసారి కూడా. 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యనాయుడు.. వాజ్పేయీ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత ప్రధాని మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ సేవలందించారు.
మూడు భాషల్లో ప్రసంగ చాతుర్యం
1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలో సాగినప్పటికీ స్వయంకృషితో మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్లో అనర్ఘళంగా ప్రసంగించే ప్రావీణ్యాన్ని గడించారు. మూడు భాషల్లోనూ అంత్యప్రాసలతో హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగం చేయడం ఆయనకే చెల్లు. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగినా ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపుపొందిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. అలుపులేకుండా నిరంతరం పనిచేయడం, పయనించడం, ప్రసంగించడం ఆయనకు ఇష్టమైన కార్యాలు. ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష, భాషలను వీడని వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు ప్రత్యేకం. ప్రతి మాటలో, చేతలో కనిపించే సరళత, సౌమ్యత, స్పష్టత ఆయన్ను విశిష్టవ్యక్తిగా నిలిపాయి. సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవ్వరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాతశత్రువు.
ప్రతిపక్షాల నుంచి కూడా గౌరవం పొందిన కొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు సమయం నేర్పారు. సమావేశాలు జరిగే సమయంలో సభాకార్యకలాపాలు నడిచిన తీరు గురించి నిమిషాలతో సహా ప్రతి వారం గణాంకాలు వెల్లడించి సభాపతిగా తనకున్న జవాబుదారీతనాన్ని చాటుకున్నారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఒక్కర్నీ సభనుంచి బయటికి పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు.
మాతృ రాష్ట్రానికి చేయూత
వాజ్పేయీ హయాంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించే ప్రధానమంత్రి గ్రామ్సడక్ యోజన, మోదీ హయంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్సిటీలు, అమృత్పథకాన్ని మొదలుపెట్టిన ఘనత వెంకయ్యనాయుడికే దక్కుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే అత్యధికంగా పట్టణ పేదల ఇళ్లు మంజూరుచేసి స్వరాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడలను స్మార్ట్సిటీల జాబితాలో చేర్చి అక్కడ మౌలికవసతుల మెరుగుదలకు కేంద్రం నుంచి సాయం అందేలా చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ సౌకర్యం మెరుగుదల కోసంమెరుగుదల, అమరావతి నగర మౌలిక సదుపాయాల కోసం రూ.1,500 కోట్లు మంజూరుచేసి రాష్ట్రానికి తనవంతు చేయూతనిచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో విభజన చట్టంలోని హామీల అమలు కోసం నిరంతరం అధికారులతో మాట్లాడుతూ వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీలున్నచోటల్లా మాతృభాష, మాతృరాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడానికి తనవంతు కృషి చేశారు.
యుక్తవయసు నుంచి ఆరెస్సెస్తో అనుబంధం
బుచ్చిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్య, నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో లా చేసిన ఆయన యుక్తవయస్సు నుంచే ఆరెస్సెస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా గెలిచారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్గా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేంతవరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల్లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది ఈయన ఒక్కరికే.
నవభారత నిర్మాణ భాగస్వాములకు అంకితం
- వెంకయ్యనాయుడు
కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, యువకుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో పాల్గొని ప్రజాజీవితంలో వివిధ బాధ్యతలతో గ్రామాలు, పట్టణ పేదల అభివృద్ధి కోసం కృషిచేసిన నాకు జీవితంలో ప్రతి అడుగూ సంతృప్తిని అందించింది. ప్రతి అడుగులోనూ నా బాధ్యతను నిబద్ధుడనై, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ముందుకుసాగాను. ఈ ప్రస్థానంలో ప్రతి పదవి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడంతోపాటు, బాధ్యతలను ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ వచ్చింది.
ప్రస్తుతం భారతదేశం అమృతకాలంలో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకుసాగుతోంది. ఈ సందర్భంలో ఈరోజు ప్రభుత్వం నాకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం ఆనందదాయకం. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఇది వారికి దక్కిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటినుంచీ గ్రామాలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం సమాజాన్ని ఉత్తేజపరిచేందుకు నిరంతరాయంగా ముందుకుసాగుతున్న నా బాధ్యతలను ఈ పురస్కారం మరింత పెంచింది’’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా