అక్రమాల్లో సాగి.. అవినీతిలో ఊగి!
‘ఇసుక.. బుసక.. బూడిద.. కాదేది అక్రమార్జనకు అనర్హం..’ మీరు చదివింది కవితాపంక్తి అనుకుంటే పొరపాటే. ఫక్తుగా.. ఓ మంత్రి వాటి ద్వారా సాగిస్తున్న అరాచక దందా. అవినీతి పథంలో ఆ ‘మాంత్రి’కుడిది ప్రత్యేక పంథా.
ఇసుక, బుసక, బూడిద.. ఆయనకు వరమే!
అడ్డగోలుగా వేలాలు.. ఆ సొమ్ములోంచి వాటాలు
జగనన్న లే-అవుట్లలో చేతివాటం
పనులు చేయకుండానే నిధులు స్వాహా
‘ఇసుక.. బుసక.. బూడిద.. కాదేది అక్రమార్జనకు అనర్హం..’
మీరు చదివింది కవితాపంక్తి అనుకుంటే పొరపాటే.
ఫక్తుగా.. ఓ మంత్రి వాటి ద్వారా సాగిస్తున్న అరాచక దందా.
అవినీతి పథంలో ఆ ‘మాంత్రి’కుడిది ప్రత్యేక పంథా.
ప్రజలు.. స్వపక్షం.. విపక్షం అన్న తారతమ్యం చూపడం ఆయనకు అస్సలు గిట్టదు!
అందరినీ ఒకేగాటన కట్టి డబ్బులను దండుకోవడం.. ముడుపులు పిండుకోవడం.. అవినీతి మత్తులో ఊగడం ఆయన నైజం!
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ప్రజలకు సేవ చేయాల్సిన ఆయన అన్ని రకాల సేవలకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆ వసూళ్ల కార్యం కోసం ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్నే తెరిచారు. ప్రజలు, గుత్తేదారులు, స్వపక్షీయులు.. ఎవరైనా సరే అక్కడ పనికో రేటు, ఫైలుకో రేటు మాట్లాడుకోవాల్సిందే. అందుకు ఆయన పీఏ, ఓఎస్డీలు కమీషన్ ఏజెంట్ల అవతారమెత్తారు. తన నియోజకవర్గంలోనే కాదు. పక్క నియోజకవర్గంలోనూ ఆయన ‘దుమ్ము’రేపుతారు. ఆ దూకుడు.. బెదిరింపులు.. దౌర్జన్యాలే అర్హతలుగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇంకేం.. ఆయన అవినీతి, అక్రమాలు, అడ్డగోలు దందాలకు అంతు, ‘హద్దు’ లేకుండా పోయింది..!!
ట్రాన్స్ఫార్మర్ వేయాలంటే కమీషన్.. రోడ్డు మరమ్మతు చేయాలంటే కమీషన్.. ప్రజలకు అవసరమైన పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలంటే కమీషన్.. పని ఏదైనా సరే ‘నాకేంటి’ అని చేయి చాచడమే అయిన ‘పని’. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను తరచూ మార్చే ఈ ప్రజాప్రతినిధికి ఎక్కడికి వెళితే అక్కడ జోలె పట్టడం ఆనవాయితీ. విరాళాల పేరుతో బలవంతంగా వసూలు చేయడం.. ఖర్చుల పేరుతో కమీషన్లను గుంజడం ఆయనకు ‘మట్టి’తో పెట్టిన విద్య. చేపల చెరువుల నుంచి భూకబ్జాల వరకు.. బుసక తవ్వకాల నుంచి బూడిద సరఫరా వరకు అక్రమంగా ఆర్జించడంలో ఆయనకు ఆయనే సాటి. కాదూ.. కూడదూ అంటే తట్ట మట్టి కూడా ఎవరూ ఎత్తలేరు..! దోసెడు బూడిదను కూడా ఎవరూ తాకలేరు..!!
తనివి‘తీర’ సంపాదించడం లేదంట..
తీర ప్రాంతంలో ఉన్న తన నియోజకవర్గంలో తాను సంపాదించడానికి ఏమీ లేదంటూ సహచర ప్రజాప్రతినిధుల వద్ద వాపోయే ఆయన.. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను పక్కనపెట్టి.. ‘ప్రైవేటు పని’ని బట్టి వసూళ్లు చేయడానికి ప్రత్యేక బలగాన్ని నియమించుకున్నారు. ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. చేనేత, కలంకారీ, హస్తకళలకు ప్రసిద్ధి. అయితే చేనేత సహకార రంగం కుదేలైనా ఆ రంగాన్ని పట్టించుకోలేదు. నిధులను సాధించలేకపోయారు.
ప్రతి మండలం నుంచి రూ.50 లక్షలు వసూలు
మంత్రి తన పీఏ మధ్యవర్తిత్వంగా నియోజకవర్గంలో ముడుపులు స్వీకరిస్తుంటారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తారు. పరులు, స్వపక్షం వారు అన్న తేడాలేకుండా ఎవరైనా ఎకరాకు రూ.20 వేలు చెల్లిస్తే చాలు.. అధికారులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకోవచ్చు. ఇసుక తవ్వకాలకు అడ్డగోలుగా వేలం నిర్వహించి ఇష్టానుసారంగా అక్రమాలకు గేట్లు తెరిచారు. అందుకు మండలానికి రూ.50 లక్షల చొప్పున వసూలు చేశారు. ఫలితంగా దళారులు పట్టపగలే విచ్చలవిడిగా టిప్పర్లతో ఇసుకను తరలించినా అడ్డుకునే వారే కరవయ్యారు. పట్టణాల్లో భవనాలు నిర్మించాలంటే ముందుగా మంత్రి కార్యాలయంలో ముడుపుల పునాది పడాల్సిందే. అవి అందితే.. నిబంధనలను ఉల్లంఘించినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా అడిగే వారే ఉండరు. ఇలా నియోజకవర్గంలో వందల సంఖ్యలో అక్రమ భవనాలు వెలిశాయి. అక్రమంగా డబ్బు వసూలు చేయడంలో రైతులనూ వదిలిపెట్టలేదు. పట్టాదారు పాసుపుస్తకాల జారీకి రైతుల నుంచి ఎకరానికి రూ.20 వేల చొప్పున వసూలు చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతలోనూ బాధిత కుటుంబాల నుంచి మంత్రి కార్యాలయం డబ్బులను దండుకుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా.. తమ నాయకుడి మాదిరిగా ఆయన అనుచరులూ అక్రమ వసూళ్లకు మరిగారు.
జగనన్న లే-అవుట్లో రూ.2 కోట్ల కమీషన్
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఓ పట్టణంలో ‘జగనన్న లే-అవుట్’ కోసం ప్రభుత్వం 40 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. మార్కెట్ ధరను పెంచి భూములు కొనుగోలు చేయడంలో మంత్రి చక్రం తిప్పారు. ఇలా కొనుగోలు చేసిన భూముల లావాదేవీల్లో ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు కమీషన్ వసూలు చేశారు. ఇలా జగనన్న లే-అవుట్ రైతులకు అందాల్సిన పరిహారంలోంచి రూ.2 కోట్లకు పైగా కమీషన్ దండుకున్నారు. మాజీ సీఎంను నిత్యం తిట్టాలంటూ ప్రోత్సహించే సీఎం జగన్ ఆశీస్సులతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి ఆ శాఖలోని ప్రతి అధికారి నుంచి లక్ష్యాలు పెట్టి మరీ వసూళ్లకు తెరలేపారు. లబ్ధిదారులకు యూనిట్ వ్యయం సరిపోక ఇప్పటికే తిప్పలు పడుతుంటే.. ఈ కమీషన్లను ఎక్కడి నుంచి తేవాలని అధికారులు గగ్గోలు పెట్టే పరిస్థితి దాపురించింది. తన నియోజకవర్గంలో కొన్ని పనులను అసలే చేయకుండా రూ.కోట్లు కొట్టేశారు. పక్క జిల్లాల్లోనూ ‘జగనన్న లేఅవుట్ల’ వ్యవహారంలో కాలు పెట్టేందుకు శతవిధాలా యత్నించారు ఈ మంత్రి. అక్కడి ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడంతో తోకముడిచారు.
జల వనరుల పనుల్లో 25 శాతం..
జలవనరుల శాఖ ఇంజినీర్లపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడేవారు. ‘మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా.. కనీసం నమస్కారం కూడా చేయరా’ అంటూ వారిపై మండిపడేవారు. తన నియోజకవర్గంలో జల వనరుల శాఖకు సంబంధించిన దాదాపు రూ.25 కోట్ల విలువైన పనులు చేపట్టి అందులోంచి 25 శాతం కమీషన్ తీసుకున్నారు. మడ భూములను ఆక్రమించి చెరువులుగా మార్చేశారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. రూ.52 కోట్ల విలువైన ఓ రోడ్డు పనులకు 10 శాతం కమీషన్ తీసుకున్నారు. అయినా ఆ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఓ గ్రామంలో వంతెన నిర్మాణం అవసరమైంది. అందుకు స్వపక్షీయులే ప్రజల నుంచి రూ.40 లక్షల వరకు విరాళాలు వసూలు చేసి మంత్రి కార్యాలయానికి పంపారు. రూ.కోటి విలువైన ఆ వంతెన అంచనాలను రూ.3 కోట్లకు పెంచారు. నియోజకవర్గంలో చేపట్టిన రహదార్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే భవన నిర్మాణాలకు మంత్రి భారీగా కమీషన్లు తీసుకున్నారు. ఫలితంగా గుత్తేదారులు వాటిని నాసిరకంగా నిర్మించారు. నియోజకవర్గంలో రూ.2 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ రహదారి నాణ్యత లోపంతో ఆరు నెలలకే కోతకు గురవుతోంది. పట్టణంలో ఓ సంస్థ రూ.85 కోట్లతో నీటి పథకం విస్తరణ పనులు చేపట్టింది. పనులు సాగాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని గుత్తేదారు సంస్థను డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మంతనాలు జరిపిన ఆ సంస్థ ఎట్టకేలకు పనులు పూర్తిచేసింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ నేత బిల్లులు రాకుండా వేధింపులకు గురిచేశారు. పట్టణంలో రూ.35 కోట్లతో ఓ సంస్థ చేపట్టిన అంతర్గత తాగునీటి పైపులైన్ల పనులు కూడా ఆ మంత్రి కార్యాలయం ఒత్తిడితోనే నిలిచిపోయాయి.
జూదానికి ప్రోత్సాహం!
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తన నియోజకవర్గంలోనూ జూద క్లబ్లను ఏర్పాటు చేసి ప్రోత్సహించారు ఆ మంత్రి. పోలీసులు అటువైపు రాకుండా ‘ఏర్పాట్లు’ చేసుకున్నారు. ఈ క్లబ్ల నుంచి నెలకు రూ.5 లక్షల కమీషన్ అందుకునేవారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తికి 5.3 ఎకరాల స్థలం ఉంది. ఆయన మృతి చెందారు. ఆస్తుల విషయంలో జడ్జి తల్లికి, జడ్జి భార్యకు మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రజాప్రతినిధి అందులోని 1.30 ఎకరాలను తన అనుచరుడికి కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లింది. జడ్జి ఆస్తికే రక్షణ లేకుండా పోయిందని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. తీర ప్రాంతంలోని 40 ఎకరాలను బినామీ పేరిట ఆ నేత కబ్జా చేశారని, వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయని తెలిసింది.
‘ముఖ్యు’డికి తెలిసినా మౌనమే..
తన నియోజకవర్గంలో ఇసుక, బుసక తవ్వకాలు జరిపి యథేచ్ఛగా తరలించేవారు. బూడిద చెరువును కబ్జా చేసి పొక్లెయిన్ల సహాయంతో బూడిద రవాణా చేసేవారు. ఉచితంగా ఎత్తే బూడిదకు ఆయన యంత్రాల ద్వారా ఎత్తితే రూ.3 వేలు, రవాణా చేస్తే రూ.10 వేల చొప్పున వసూలు చేసేవారు. ఇలా రూ.కోట్లలో వ్యాపారం చేశారు. ఈ పంచాయితీ సీఎం వద్దకు వెళ్లినా.. ఆయన మౌనం వహించారు. దీన్ని బట్టి.. ‘ముఖ్యు’డి వద్ద ఆ నేత పరపతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2009లో మొదటిసారిగా ఒక నియోజకవర్గం నుంచి, 2014లో మరో నియోజకవర్గం, 2019లో తిరిగి మొదటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఇప్పుడు(2024లో) మరో నియోజకవర్గం నుంచి బరిలో నిలవనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ ప్రకటన ఇలా విడుదల అవగానే అలా ఆ నియోజకవర్గంలోని ఇసుకపై పడ్డారు. రోజుకు రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎన్నికల విరాళాలు అంటూ రియల్టర్లు, బిల్డర్లు, గుత్తేదారులు, పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ నేత ఆగడాలను చూసి ఆ నియోజకవర్గ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?