‘అప్పు’నంగా ఖర్చు!
ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కారు లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తోంది. జీఎస్డీపీలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు పుట్టిస్తోంది. ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా కుదిరితే అలా చేయి చాస్తూనే ఉంది.
రూ.వేల కోట్ల రుణాల్లో ఆస్తుల సృష్టి అంతంతే!
ఉపయోగం లేని వాటికే అత్యధిక వ్యయం
నిరుడు ఇది ఏకంగా 86%తో చెత్త రికార్డు
జగన్ సర్కారులో పట్టాలు తప్పిన ఆర్థిక నిర్వహణ
అప్పు చేసి పప్పు కూడు... అని సామెత! పాలనలో అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ ఎందుకు అప్పు చేస్తున్నాం, వచ్చిన సొమ్ములతో ఏం చేస్తున్నామనేది కీలకం! రుణం తీసుకుని విందులు, వినోదాలకు ఖర్చు చేస్తే అది గుదిబండగా మారుతుంది. అలాకాకుండా దాంతో ఇల్లు నిర్మించుకుంటే కుటుంబానికి ఆస్తిగా మారుతుంది. ప్రతి కుటుంబానికీ ఈ విషయం తెలియంది కాదు. అర్థం కానిదీ కాదు. ఒక్క సీఎం జగన్కు తప్ప!
ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కారు లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తోంది. జీఎస్డీపీలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు పుట్టిస్తోంది. ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా కుదిరితే అలా చేయి చాస్తూనే ఉంది. ఆస్తులనూ తాకట్టు పెడుతోంది. లెక్కకు మిక్కిలి గ్యారంటీలు ఇస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో
అంతకు ముందున్న పరిమితిని తనంతట తానే పెంచేసుకుని... అదనపు అప్పులు తీసుకుంటోంది. ఇలా తెచ్చిన అప్పులతో ఆస్తులను సృష్టించే పనులేవీ చేయడంలేదు. మూలధన ఖర్చుగా వినియోగించడం లేదు. ఎలాంటి ప్రతిఫలం ఇవ్వని రెవెన్యూ వ్యయంగా మార్చేస్తోంది.
అభివృద్ధికి ఆమడ దూరం
జగన్ ఐదేళ్ల ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ అడుగులు అభివృద్ధి వైపు పడలేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించింది. రెండు, మూడింటి నిర్మాణాలు నామమాత్రంగా పూర్తయ్యాయి. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిన ఉదంతాలు లేవు. పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల
కల్పనపైనా దృష్టి సారించలేదు. రహదారుల నిర్మాణమూ లేదు. పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేల అనుసంధానం పెంచే పనులేవీ చేయలేదు. మరోవైపు సేవారంగం విస్తృతికి అవసరమైన అవకాశాలను కల్పించలేదు. జగన్ సర్కారు నాలుగేళ్లలో (లెక్కలు ఖరారు చేసింది నాలుగేళ్లకే) చేసిన అప్పులో కేవలం 28% మాత్రమే ఆస్తుల సృష్టికి వినియోగించారు. మిగిలిన 72 శాతాన్ని రెవెన్యూ వ్యయంగానే మళ్లించేశారు. ముఖ్యంగా... 2022-23లో రెవెన్యూ వ్యయం ఏకంగా 86.74% ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ పెడధోరణి కారణంగా రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు గుదిబండలా మారనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ మున్ముందు మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఎఫ్ఆర్బీఎం చట్టం ఏం చెబుతోంది?
బడ్జెట్ రూపకల్పనకు, దాని అమలుకు ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ) చట్టం ఎంతో కీలకం. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి వచ్చే మొత్తం రాబడులను కలిపితే రెవెన్యూ ఆదాయం అవుతుంది. రాష్ట్ర సొంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లను కలిపితే వచ్చేది... రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడికి, మనం చేసే రెవెన్యూ ఖర్చు సమానంగా ఉండాలి. అప్పుడే బడ్జెట్లో రెవెన్యూ లోటు అనేది ఉండదు. అలాంటి సందర్భంలో తీసుకునే ప్రతి రుణంలో అత్యధిక భాగాన్ని మూలధన వ్యయం కోసం వినియోగించుకునేందుకు వీలవుతుంది. అంటే అప్పులు చేసి ఆస్తులను సృష్టించుకునే అవకాశం లభిస్తుంది. కానీ, రెవెన్యూ వ్యయం కోసమే అప్పులు చేయడం అనేది ప్రమాదకరమైన పరిణామం. జగన్ సర్కారులో అది మరీ విశృంఖలమైంది. ఫలితంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులను సర్కారే స్వయంగా సృష్టిస్తోంది. జగన్ సర్కారు ఏ ఏడాది... ఎంతమేర అప్పులు చేసింది? అందులో మూలధన వ్యయంగా ఎంత మొత్తం ఉందో పరిశీలిస్తే ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ రుణంలో కేవలం బహిరంగ మార్కెట్ రుణం, విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, నాబార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలే కలిపి ఉంటాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణ మొత్తాలు లేవు. కార్పొరేషన్ల రుణాలను మినహాయించినా సరే... ఆర్థిక పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వాటిని కూడా కలిపితే ఇంకెంత దారుణంగా ఉంటుందో వేరే అంచనా అక్కర్లేదు.
కేటాయింపులకు... వాస్తవ ఖర్చులకు మధ్య ఎంతో తేడా
జగన్ సర్కారు అనేక అనధికారిక అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తోంది. కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణం తీసుకున్నారు... ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ఎంత అప్పు తెచ్చారనే అంశాలను కాగ్ అడిగినా ప్రతినెలా ఇవ్వడమే లేదు. కేవలం బహిరంగ మార్కెట్ రుణాలు లేదా ఇతర రుణాలు కలిపి కాగ్కు ఏపీ సర్కారు తెలియజేసిన వివరాల ప్రకారం... తెచ్చిన రుణంలో చాలాకొద్ది మొత్తం మాత్రమే ఆస్తులను సృష్టించేందుకు వినియోగిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ అంచనాల సమయంలోనే మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కేటాయింపులు 12-14 శాతం లోపు ఉంటున్నాయి. అసలు కేటాయింపులే తక్కువ... అలాంటిది ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చేసిన వాస్తవ ఖర్చు చూస్తే మరీ విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కింద 10 శాతమైనా ఖర్చు చేయని దుస్థితి రాష్ట్రంలో ఉంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?