నేను ఓడిపోయినా పర్వాలేదు: మంత్రి ధర్మాన

ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో గురువారం జరిగిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Updated : 15 Mar 2024 06:19 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో గురువారం జరిగిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లా, నగర కళింగ వైశ్య సంఘ నాయకులు వైకాపాను గెలిపించాలనుకోవడం సంతోషం. వారి నుంచి నాకు మద్దతు లభించదని గతంలో అనుకున్నాను. ఇన్నాళ్లూ ఎన్నికల్లో గెలుస్తానో లేదో అనే ఆవేదనతో ఉండేవాడిని. కానీ రోజులు గడిచేకొద్దీ గెలుస్తాననే నమ్మకం పెరుగుతోంది. మీ ఆదరణ చాలు. ఇక నేను ఓడిపోయినా పర్వాలేదు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని