‘కబ్జాల బండి’కి అక్రమాలే ఇరుసు!
విజయనగరం జిల్లాలోని ఓ కోటలాంటి ప్రాంతానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. అధికారం చేపట్టింది మొదలు... అడ్డగోలు దోపిడీతో పేట్రేగిపోతున్నారు.
ఐదేళ్లలో రూ.వందల కోట్ల ఆర్జన
ఆయన కన్నుపడితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల హాంఫట్
ముడుపులు చెల్లిస్తే ఏ పనికైనా ‘ఎస్’ అనేస్తారు
విజయనగరం జిల్లాలో పేట్రేగిపోతున్న వైకాపా ప్రజాప్రతినిధి
ఆయన ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి...
తన హోదాలోని తొలి రెండక్షరాలైన ప్రజలను వదిలేశారు...
చివరి రెండక్షరాలైన ‘నిధి’పైనే దృష్టి పెట్టారు...
అధికారం అండగా, అక్రమాలే ఇరుసుగా...
తన బండిని సోదర స‘మేత’ంగా పరుగులు పెట్టించారు...
సొంత మనుషులను గద్దల్లా మోహరించి...
గిరిజనుల ఆస్తుల్ని మింగేశారు...
ఉపాధి హామీలో బినామీలకు చోటిచ్చారు...
స్థలాలు, భూములు, కాంట్రాక్టులే ఆలంబనగా...
ఐదేళ్లలో కళ్లు చెదిరే ఆస్తులను పోగేశారు...
విజయనగరం జిల్లాలోని ఓ కోటలాంటి ప్రాంతానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. అధికారం చేపట్టింది మొదలు... అడ్డగోలు దోపిడీతో పేట్రేగిపోతున్నారు. ఆయన కన్ను పడితే... ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ఏదైనా కబ్జా కావాల్సిందే. ఖాళీ జాగాలైనా, వివాదాస్పద భూములైనా ఆయన పరం అవ్వాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా... ఆయనకు ముడుపు చెల్లించుకోవాల్సిందే. చివరికి గిరిజనుల ఆస్తుల్నీ వదలకుండా మింగేసిన ఈ ప్రజాప్రతినిధి అయిదేళ్లలో రూ.వందల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టి ‘‘కబ్జాల బండి’’గా పేరొందారు.
రికార్డులు మార్చేసి... బంధువులకు నజరానా
కొత్తవలస మండలం అర్థానపాలెం పరిధిలో ఓ రాజు పేరిట ఉన్న 14.40 ఎకరాల భూమిని ఈ నాయకుడి అత్తవారింటి తరఫు బంధువులు గతంలో ఆక్రమించుకున్నారు. తాను ఎన్నికల్లో గెలిచాక... ఈ నాయకుడు అధికారులపై ఒత్తిడి చేసి రికార్డులను తారుమారు చేయించి, ఆక్రమిత భూమికి తన అత్తవారింటి తరఫు బంధువుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలను చేయించారు. ప్రతిఫలంగా ప్రధాన రహదారి పక్కనే అత్యంత విలువైన 25 సెంట్ల స్థలాన్ని వారి నుంచి తీసుకున్నారు. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి ఓ ఇంటిని నిర్మించుకున్నారు. స్థానిక స్థిరాస్తి వ్యాపారులు కొందరు ఈ భవనాన్ని తమ సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చారు.
సెటిల్మెంట్లు..... దందాలు
- కొత్తవలస మండలం గులివిందాడలో ఒక లేఅవుట్ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొనగా... ఈ నాయకుడు జోక్యం చేసుకున్నారు. రూ.15 కోట్ల విలువైన మూడెకరాల భూమిని నామమాత్రపు ధరకు లాగేసుకున్నారు. చింతలపాలెంలోని ఓ లేఅవుట్లోనూ ఇలాగే వాటా తీసుకున్నారు.
- చింతలపాలెంలోని 17.23 ఎకరాల ప్రభుత్వ భూమి, 18.71 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమి ఓ నాయకుడి ఆధీనంలో ఉంది. ఏకంగా రూ.100 కోట్ల వరకు విలువున్న మొత్తం 35.94 ఎకరాల భూములకు ఆయన బంధువుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయించారు. ప్రతిగా అతని నుంచి ఈ ప్రజాప్రతినిధి రూ.25 కోట్ల వరకు అందుకున్నారు.
- నియోజకవర్గ పరిధిలోని అమ్మచెరువులో రూ.10 కోట్ల విలువైన 4.86 ఎకరాలను, వీరసాగరం చెరువులో రూ.3 కోట్ల విలువైన 2.90 ఎకరాలను ఆక్రమించేశారు.
- దెందేరు గ్రామంలో పది మంది యాదవులకు సంబంధించిన రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమిని నకిలీ 1బీతో కాజేశారు.
వివాదాన్ని పరిష్కరిస్తానంటూ 12 ఎకరాలు మాయం
- కొత్తవలస మండలంలోని ఒక గ్రామంలో గిరిజనులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 108 ఎకరాల భూమి విషయంలో కొంత వివాదం ఉంది. దీన్ని పరిష్కరిస్తానంటూ అందులో 12 ఎకరాలను సదరు ప్రజాప్రతినిధి తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని విలువ రూ.60 కోట్ల పైమాటే. ఆ తర్వాత అదే భూమిలో స్థిరాస్తి వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా... గిరిజనులు అడ్డుకున్నారు. దాంతో వారిని వెనకుండి నడిపించారంటూ వైకాపా ఎంపీటీసీ సభ్యురాలిపై పోలీసు కేసు పెట్టించారు.
- అర్థానపాలెంలోని ఆరెకరాల స్థలం రెవెన్యూ దస్త్రాల్లో ఒకచోట జిరాయితీగా, మరోచోట గయాల్ భూమిగా నమోదై ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేయించి, అందులో రూ.5 కోట్ల విలువైన ఎకరం భూమిని తన పరం చేసుకున్నారు.
- సస్పెన్షన్కు గురైన ఓ తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో కొత్తవలస, చింతలపాలెం, సంతపాలెం, దెందేరు, గులివిందాడ, రెల్లి తదితర గ్రామాల్లో కొన్ని రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయించి భూముల్ని ఆక్రమించుకున్నారు.
ముడుపుల కింద రూ.కోట్ల విలువైన స్థలాలు
ఎవరైనా స్థిరాస్తి లేఅవుట్ వేయాలంటే విస్తీర్ణాన్ని బట్టి వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలాన్ని ఈ నాయకుడికి ముడుపు కింద చెల్లించుకోవాల్సిందే. గత అయిదేళ్ల వ్యవధిలో దాదాపు రూ.40 కోట్ల విలువైన స్థలాలను ఇలా తన బినామీల పేరిట రాయించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిస్తే ఆయనకు కాసుల పంటే. నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా లేఅవుట్ వేయాలంటే తొలుత ఈ నాయకుడి సోదరుడ్ని కలిసి ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే భూమార్పిడి సహా ఇతర అనుమతుల దస్త్రాలు ముందుకు కదులుతాయి. ఆయనకు తెలియకుండా ఏ ఒక్కటి ఆమోదించినా... బాధ్యులైన అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయించేస్తారు.
వివాదాస్పద భూముల వేటకు ప్రత్యేక బృందం
నియోజకవర్గంలోని ఖాళీ స్థలాలను, వివాదాస్పద భూములను గుర్తించేందుకు ఏకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ ఆయా వివరాల్ని ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు. వాటి ఆధారంగా సంబంధిత భూములను కైవసం చేసుకోవడానికి ఆయన ప్రణాళికలను అమలు చేస్తుంటారు. ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు కొందరు అధికారులను తన చుట్టూ పెట్టుకున్నారు. పేరుకే ప్రజాప్రతినిధి తప్ప... అయిదేళ్లుగా ఈ నాయకుడి దృష్టంతా భూముల కబ్జాపైనే.
కాసులు ముట్టజెప్పితే కోరినచోట పోస్టింగు
- తన నియోజకవర్గం పరిధిలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల్లో కీలక పోస్టుల్లో అధికారులను నియమించడానికి బేరాలు పెట్టారు. ఎక్కువ మొత్తం చెల్లిస్తే వారు కోరిన చోట పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. ఒక ఇన్స్పెక్టర్ వద్ద రూ.5 లక్షలు తీసుకుని ఓ స్టేషన్లో పోస్టింగు ఇప్పించడం చర్చనీయాంశమైంది.
- ఈ నాయకుడు ఒక స్థిరాస్తి వ్యాపారితో కలిసి కొంత భూమిని కొన్నారు. అది వాణిజ్య భూమిగా అధికారిక దస్త్రాల్లో నమోదై ఉన్నా, వ్యవసాయ భూమిగా రాయాలంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. దానికి అంగీకరించకపోవడంతో పట్టుబట్టి మరీ ఓ తహసీల్దారును బదిలీ చేయించారు.
- ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గంలో జరిగిన పనులన్నింటినీ తన సొంత మనుషులకు అప్పగించి, వారి నుంచి కమీషన్లు తీసుకున్నారు.
- స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికారులతో... నియోజకవర్గం పరిధిలోని స్థిరాస్తి వ్యాపారులందరికీ ఫోన్లు చేయించి, వారి ద్వారా రూ.కోటి వరకు వసూలు చేశారు.
- అనధికారిక రీచ్లలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
- స్టోన్ క్రషర్ల యజమానుల నుంచి పర్యావరణ అనుమతి ధ్రువపత్రాల జారీకి డబ్బులు వసూలు చేశారు.
- స్థానికంగా ఉన్న ప్రధాన కర్మాగారాల్లో సరకు రవాణా వాహనాల కాంట్రాక్టును సంబంధిత యాజమాన్యాలను బెదిరించి మరీ తీసుకున్నారు. అప్పటికే ఈ రంగంలో ఉన్న కొందరిని బలవంతంగా పక్కకు తప్పించారు.
ఈనాడు, అమరావతి, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన