సివిల్స్లో తెలుగు తేజాలు
దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు.
మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ యువతి అనన్యరెడ్డి
విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు
నలుగురికి 100లోపు ర్యాంకులు
టాపర్గా లఖ్నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ
ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంకు
ఈనాడు, హైదరాబాద్, దిల్లీ, కొచ్చి - న్యూస్టుడే, భువనేశ్వర్: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. రెండు రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. లఖ్నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటీ కాన్పుర్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన ఆయన.. అదే సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంపిక చేసుకుని విజయం సాధించారు.
ఒడిశాలోని అనుగుల్ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్ ప్రధాన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎన్ఐటీ రవుర్కెలా నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. పి.కె.సిద్ధార్థ్ రామ్కుమార్, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. తొలి 5 స్థానాలు సాధించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సివిల్స్-2023 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30మంది దివ్యాంగులు ఉండడం విశేషం. జనరల్ విభాగంలో 347 మంది, ఈడబ్ల్యూఎస్లో 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగంలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. సివిల్స్-2023 ప్రాథమిక పరీక్షకు 10,16,850 నమోదుచేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. చివరగా 1,016 మంది అత్యున్నత కొలువులు సాధించారు.
అప్పుడు ఉమాహారతి... ఇప్పుడు అనన్యరెడ్డి
గత ఏడాది సివిల్ సర్వీసెస్-2022లో సూర్యాపేట జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించారు. ఆమె అయిదో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అప్పట్లో నారాయణపేట ఎస్పీగా ఉన్నారు. ఈసారి మహబూబ్నగర్ చెందిన అడ్డాకుల మండలం పొన్నకల్కు చెందిన అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో 3వ స్థానంలో నిలవడం గమనార్హం. దిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల మిరాండ హౌస్లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఐచ్ఛిక సబ్జెక్టు ఆంత్రోపాలజీలో మాత్రం హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నారు. ఆమె తండ్రి మహబూబ్నగర్లో స్థిరాస్తి వ్యాపారి.
కలల కొలువు కోసం కార్పొరేట్ ఉద్యోగం వదిలి..
తొలి ర్యాంకు సాధించిన లఖ్నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో రూ.లక్షల్లో జీతం లభించే కార్పొరేట్ కొలువును విడిచిపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్లో 15 నెలలు పనిచేసిన ఆయన అనంతరం రాజీనామా చేశారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దశను కూడా దాటలేకపోయారు. అయినా నిరాశ చెందలేదు. తప్పులు సరిదిద్దుకుని మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. 2022లో 236వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో మళ్లీ సివిల్స్ రాసి జాతీయస్థాయిలో తొలి స్థానం సాధించారు. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి.. పరీక్ష సిలబస్ను అంచనా వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శ్రీవాస్తవ చెప్పారు. హార్డ్వర్క్, స్మార్ట్వర్క్ మధ్య తేడా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడమే తన విజయ రహస్యమని వివరించారు.
ఇంటర్వ్యూ సమయంలో అమ్మను కోల్పోయా: అనిమేష్ ప్రధాన్, రెండో ర్యాంకర్
‘‘2022లో సివిల్స్ సన్నద్ధత ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. ఎలాంటి శిక్షణ తీసుకోలేదు’’ అని రెండో ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ‘‘సివిల్స్ ఫలితం విషయంలో నా కల నెరవేరింది. గత నెలలో సివిల్స్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లోనే నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది’’ అని పేర్కొన్నారు.
గత ఏడాది కన్నా అధికం
కొన్నేళ్లుగా సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి 45-50 మంది మాత్రమే ఎంపికవుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈసారి ఆ సంఖ్య 60 వరకు చేరుకుంది. మరికొందరు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 46 మందికిపైగా విజేతలుగా నిలిచారు. సివిల్స్పై అవగాహన పెరగడం వల్ల పలువురు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారని.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తున్నారని హైదరాబాద్కు చెందిన సివిల్స్ శిక్షణ నిపుణుడు విష్ణు విశ్లేషించారు.
ఐపీఎస్ శిక్షణ పొందుతూనే..
తొలి అయిదు స్థానాల్లో నిలిచిన ఆదిత్య శ్రీవాస్తవ (1), పి.కె.సిద్ధార్థ్ రామ్కుమార్ (4), రుహానీ (5).. ప్రస్తుతం హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. సివిల్స్ ఫలితాల్లో ఓ ఐపీఎస్ ట్రైనీకి తొలి ర్యాంకు రావడం.. గత దశాబ్దానికిపైగా కాలంలో ఇదే తొలిసారి.
సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. వారి కృషి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలి: ఆంధ్రప్రదేశ్
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ తీర్పు వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పును వాయిదా వేసింది. -
నన్నెవరూ అపహరించలేదు
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు అడ్డుకొని, నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణను మూసివేసింది. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.