PRC: చర్చలు అసంపూర్ణం
పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా
ఉద్యమాన్ని విరమించాలని కోరిన ప్రభుత్వం
71 డిమాండ్లపై హామీ ఇస్తేనే.. నిర్ణయం తీసుకుంటామన్న ఐకాసలు
ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.
చిత్రంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, తదితరులు
ఈనాడు, అమరావతి: పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రధానమైన ఫిట్మెంట్ అంశంపై ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. సచివాలయంలో సుమారు అయిదున్నర గంటల పాటు చర్చలు సాగాయి. మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉంది. పీఆర్సీ నివేదికపై సీఎస్ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెడితేనే.. చర్చలు ముందుకు సాగుతాయని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. 11వ పీఆర్సీ కమిషనర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి, జిల్లాల్లో పర్యటించి రూపొందించిన నివేదికపైనే చర్చించాలని పట్టుబట్టగా.. అందుకు సజ్జల, మంత్రి అంగీకరించారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తరఫున 55% ఫిట్మెంట్కు ప్రతిపాదించగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ 50%, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 34% ఉండాలని కోరారు. సీపీఎస్ను రద్దుచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండు చేశాయి. హెచ్ఆర్ఏ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల విధానమే ఉండాలన్నాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు సీఆర్డీఏ పరిధిలోని అందరికీ 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరగా..
అసలు సీఆర్డీఏ ఎక్కడుందని సజ్జల, మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. పీఆర్సీకి సంబంధించి మొత్తం 20 అంశాలను ఉద్యోగసంఘాల నేతల ప్రభుత్వం ముందుంచారు. రెండు రోజుల పాటు చర్చలు జరిగినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని వారు పెదవి విరిచారు.
ఉద్యమ విరమణ, వాయిదాపై ప్రత్యేక చర్చలు
ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసిన తర్వాత.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లుతో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. ప్రధానమైన పీఆర్సీ, హెచ్ఆర్ఏ చర్చలు కొనసాగుతున్నందున ఉద్యమాన్ని విరమించాలని, మొండిగా పట్టుదలకు పోవద్దని కోరారు. మిగతావాటిని పరిష్కరిస్తామన్నారు. తమ డిమాండ్లపై హామీ ఇస్తేనే విరమిస్తామని, సీఎస్, ఆర్థికమంత్రి ఎప్పటికి ఏ సమస్యను పరిష్కరిస్తారో చెప్పాలని ఐకాస ప్రతినిధులు కోరారు. ఉద్యమాన్ని వాయిదా వేయడంపై చర్చలకు వస్తారా? అని ప్రతినిధులను కోరగా.. వస్తామని చెప్పారు. ఉద్యమం వాయిదా వేయడంపై మరోమారు ఐకాసలతో చర్చించే అవకాశం ఉంది.
సుహృద్భావ వాతావరణంలో చర్చలు: సజ్జల
ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని వెెంటనే, మరికొన్ని 15 రోజుల్లో పూర్తయ్యేవి, నెల, రెండు నెలల్లో పరిష్కరించాల్సినవి ఉన్నాయి. వాటిలో పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ ప్రధానమైనవి. ఐఆర్ 27% సంరక్షిస్తూనే 14.29 ఫిట్మెంట్ ఇస్తామని సూచించాం. ఉద్యోగుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో సీఎంతోనూ ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి. పదవీవిరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగులకు భద్రత ఉండాలని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు ఐదారు ఐచ్ఛికాలను చెప్పాయి. సీపీఎస్పై నా వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది.
ఫిట్మెంట్పై స్పష్టత లేదు
- బండి శ్రీనివాసరావు
పీఆర్సీ నివేదికలోని 45 పత్రాలు మాకు ఇచ్చి చర్చించారు. ఆ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరాం. ఫిట్మెంట్పై స్పష్టత లేదు. నిర్ణయం తీసుకునే అధికారం సీఎం వద్ద ఉంది. 1.7.2018 నుంచి 55% ఫిట్మెంట్ కోరాం. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామన్నారు. చర్చలకు మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సంతృప్తికరంగా జరిగినా, పూర్తికాలేదు. 71 డిమాండ్లతో మేం ఇచ్చిన నోటీసుపై సీఎస్, మంత్రి ఎప్పటికి పరిష్కరిస్తారో చెప్పాలి. అవేవీ లేకుండా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు.
సీఎం వద్దకైనా నల్లబ్యాడ్జీలతోనే
- బొప్పరాజు వెంకటేశ్వర్లు
పీఆర్సీ నివేదికను పాక్షికంగానే ఇచ్చారు. మొత్తం ఆరు సంపుటాలను ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పాం. పీఆర్సీ సిఫారసులను ఆమోదిస్తూ జీవోలు ఇవ్వాలని.. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పాం. రూ.1,600 కోట్ల బకాయిలు, పెండింగ్ డీఏలు, సీపీఎస్, హెల్త్కార్డుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని చెప్పాం. 16న ధర్నాలు యథావిధిగా జరుగుతాయి. ఉద్యమాన్ని వాయిదా వేయాలని కోరినా, మా 71 డిమాండ్లపై చర్చలు జరిగేవరకు ఉద్యమాన్ని విరమించబోమని చెప్పాం. అప్పటి వరకు సీఎం వద్దకైనా చర్చలకు నల్లబ్యాడ్జీలతోనే హాజరవుతాం.
వైద్యబిల్లుల చెల్లింపు రూ.10లక్షలకు పెంచాలి
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
ఉద్యోగులకు వైద్యబిల్లుల చెల్లింపు రూ.2లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలని కోరాం. ఫిట్మెంట్ 14.29%కు అంగీకరించబోమని, 34%కు తగ్గకుండా ఇవ్వాలని కోరాం. గ్రాట్యుటీని రూ.16లక్షల నుంచి రూ.18లక్షలకు పెంచాలి. పిల్లల సంరక్షణ సెలవులు ఏడాది ఇవ్వాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు, హెచ్వోడీ కార్యాలయ సిబ్బందికి హెచ్ఆర్ఏ 30% ఇవ్వాలి. పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ సరిపోదు. వారికి మినిమమ్ టైం స్కేలు అమలు చేయాలి. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్స్ ఇవ్వాలి. సీఎం జగన్తో ఉద్యోగ సంఘాలకు సమావేశం నిర్వహించి, అన్నీ తేల్చాలని విన్నవించాం.
అధికారుల నివేదిక ప్రామాణికం కాదు
- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
సీఎస్ కమిటీ సమర్పించిన సిఫారసులు ప్రామాణికం కాదని, పీఆర్సీ కమిషన్ నివేదికపైనే చర్చ జరగాలని కోరాం. హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ కొనసాగించాలని పీఆర్సీ కమిషన్ సూచిస్తే అధికారుల కమిటీ తగ్గించాలంది. హైదరాబాద్ నుంచి వచ్చినందుకు ఐఏఎస్లు నెలకు రూ.40వేలు అద్దె తీసుకుంటున్నారు, ఇది ఎలా శాస్త్రీయమో చెప్పాలన్నాం. ఫిట్మెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా 20 అంశాలపై అన్ని సంఘాలూ ఒకే తాటిపై నిలబడ్డాయి. కనీస వేతనం రూ.26వేలు ఉండాలని కోరాం. శుక్ర లేదా సోమవారం సీఎంతో జరిగే సమావేశంలో పీఆర్సీకి శుభం కార్డు పడుతుందని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
రూ.7 వేల కోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు..
ఎప్పుడో బటన్ నొక్కి, నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. -
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... తోఫాకో దోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి
ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
ఇదీ సంగతి!
-
సంక్షిప్తవార్తలు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. -
ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్టేబుల్ సమావేశం
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి
ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
వారికి లేని బాధ మీకెందుకు?
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.