Adani Wilmar: విల్మర్తో జాయింట్ వెంచర్కు అదానీ గుడ్బై?
Adani Wilmar: ఇకపై కేవలం కీలక రంగాల వ్యాపారాలపై మాత్రమే దృష్టి పెట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విల్మర్తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి వైదొలిగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
దిల్లీ: సింగపూర్కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (Adani Wilmar Ltd) నుంచి నిష్క్రమించే యోచనలో అదానీ గ్రూప్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తమ వాటాను విక్రయించేందుకు పలు అంతర్జాతీయ స్థాయి ఎఫ్ఎంసీజీ కంపెనీలతో అదానీ గ్రూప్ (Adani Group) చర్చలు జరుపుతున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విల్మర్ ఇంటర్నేషనల్తో కలిసి అదానీ గ్రూప్ (Adani Group).. ‘అదానీ విల్మర్ లిమిటెడ్ (Adani Wilmar Ltd)’ పేరిట జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఇరు సంస్థలకు 43.97 శాతం వాటాలు ఉన్నాయి. తమ వాటాల విక్రయం వల్ల 2.5-3 బిలియన్ డాలర్లు సమీకరించాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
పోర్టుల నుంచి ఇంధనం వరకు వివిధ రంగాల్లోకి అదానీ గ్రూప్ (Adani Group) విస్తరించి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎఫ్ఎంసీజీ నుంచి వైదొలగి కేవలం ఇన్ఫ్రా వంటి కీలక రంగాలపై దృష్టి కేంద్రీకరించే యోచనలో అదానీ గ్రూప్ ఉన్నట్లు సమాచారం. అదానీ విల్మర్ (Adani Wilmar Ltd) నుంచి నిష్క్రమించడం వల్ల వచ్చే నిధులను ఈ గ్రూప్ ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత వంట నూనెల మార్కెట్లో అదానీ విల్మర్కు గణనీయ వాటా ఉన్న విషయం తెలిసిందే. ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు సహా ప్యాకేజ్డ్ వంట సరకులను ఈ కంపెనీ విక్రయిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.55,262 కోట్ల ఆదాయంపై రూ.607 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. అదానీ విల్మర్ షేరు విలువ సోమవారం మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో 0.98 శాతం నష్టపోయి రూ.314.30 దగ్గర కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం