Adani Colombo port: అదానీ ప్రాజెక్టులోకి అమెరికా నిధులు.. కొలంబో పోర్టుకు 533 మి.డాలర్లు
Adani Colombo port: కోలంబో పోర్టును అదానీ గ్రూప్ సహా మరో రెండు భాగస్వామ్య సంస్థల కన్సార్టియం అభివృద్ధి చేస్తోంది. దీనికి నిధులు అందజేసేందుకు అమెరికాకు చెందిన డీఎఫ్సీ ముందుకు వచ్చింది.
దిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో అదానీ గ్రూప్ (Adani Group) అభివృద్ధి చేస్తోన్న నౌకాశ్రయానికి రుణం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. అగ్రరాజ్యానికి చెందిన ఆర్థికాభివృద్ధి సంస్థ ‘ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC)’ 533 మిలియన్ డాలర్లు ఇవ్వనుంది. భారత్లో అతిపెద్ద పోర్టుల నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (APSEZ)’, శ్రీలంకకు చెందిన జాన్ కీల్స్ హోల్డింగ్స్, శ్రీలంక పోర్ట్స్ అథారిటీ కలిసి ‘కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (CWIT)’ అనే కన్సార్షాయాన్ని ఏర్పాటు చేశాయి. సీడబ్ల్యూఐటీయే పోర్టు అభివృద్ధిని చేపడుతోంది. తాజాగా అమెరికా డీఎఫ్సీ ఈ సంస్థకే నిధులు అందజేయనుంది. ఇలా అదానీ గ్రూప్ చేపట్టిన ఓ ప్రాజెక్టుకు అమెరికా నిధులు అందజేయడం ఇదే తొలిసారి. దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడం కోసమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తుండడం గమనార్హం.
కొలంబో పోర్టు (Colombo Port)లోని డీప్వాటర్ షిప్పింగ్ కంటైనర్ టెర్మినల్ అభివృద్ధికి అమెరికా నిధులు అందజేస్తోందని ‘ఏపీసెజ్’ ప్రకటించింది. శ్రీలంకలో ప్రైవేట్ రంగ వృద్ధికి ఈ నిధులు దోహదం చేస్తాయని పేర్కొంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కావాల్సిన విదేశీ మారక నిల్వలూ సమకూరుతాయని తెలిపింది. స్మార్ట్, గ్రీన్ పోర్టుల వంటి సుస్థిర మౌలిక వసతుల అభివృద్ధిలో అమెరికా, శ్రీలంక, భారత్ల సమన్వయం దీనితో మరింత ముందుకు సాగుతుందని అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కీలక ప్రాజెక్టులకు డీఎఫ్సీ (DFC) ఆర్థిక పరిష్కారాలను అందజేస్తుంటుంది. ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతులు, వ్యవసాయం, చిరు వ్యాపారాలు, ఆర్థిక సేవల రంగానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తుంటుంది.
ఈ మూడు ఏమారుస్తాయ్.. మీ ఆన్లైన్ కొనుగోళ్ల ఖర్చును పెంచేస్తాయ్!
హిందూ మహాసముద్రంలో కొలంబో పోర్టు అతిపెద్ద, అత్యంత రద్దీ నౌకాశ్రయం. 2021 నుంచి ఈ పోర్టు సామర్థ్యంలో 90 శాతం వినియోగంలో ఉంది. తాజా ప్రాజెక్టు పూర్తయితే.. 1,400 మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతు రేవు అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా 24,000 TEUల భారీ కంటైనర్ వెసెల్స్ సైతం ఆగేందుకు సదుపాయాలు ఉంటాయి. డీఎఫ్సీ నిధులను ఏపీసెజ్ సీఈఓ కరణ్ అదానీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీలంక వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో గణనీయ మార్పు వస్తుందని తెలిపారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా శ్రీలంక వాణిజ్య, వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు డీఎఫ్సీ సీఈఓ స్కాట్ నాథన్ స్పందిస్తూ.. శ్రీలంక ప్రపంచ రవాణా మార్గాల్లో కీలక స్థానంలో ఉందని తెలిపారు. సగానికి పైగా కంటైనర్ నౌకలు ఈ దేశ జలాల ద్వారానే వెళుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అందించబోయే నిధులు పోర్టు సామర్థ్యం విస్తరణకు దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సైతం దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!