Air India: 6 రోజులకో కొత్త విమానం: ఎయిరిండియా CEO
Air India CEO: ఎయిరిండియా ఆర్డర్ పెట్టిన కొత్త విమానాలు సగటున ఆరు రోజులకొకటి చొప్పున అందుబాటులోకి రానుందని సీఈఓ తెలిపారు. ఇతర కంపెనీలతో పోటీ పడగలమని విశ్వాసం వ్యక్తంచేశారు.
Air India | ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా (Air India) భారీ ఎత్తున ఆర్డర్ పెట్టిన కొత్త విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాబోయే 18 నెలల్లో సగటున 6 రోజులకో కొత్త విమానం సేవలందించడానికి సిద్ధం కానుందని కంపెనీ సీఈఓ, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ పేర్కొన్నారు. ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ 470 కొత్త విమానాలను ఈ ఏడాది మొదట్లో ఆర్డర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ అధ్యక్షుల సమావేశంలో క్యాంప్బెల్ విల్సన్ మాట్లాడారు.
కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయని, ఇప్పటికే చాలా మందిని రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ కూడా ఇస్తున్నామని విల్సన్ పేర్కొన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ఎయిరిండియా నుంచి కస్టమర్లు ప్రధానంగా కోరుకునేది నమ్మకం, సమయపాలన అని, ఆ విషయాల్లో వారిని సంతృప్తి పరచడం సవాలుతో కూడుకున్నదేనని చెప్పారు. ఇప్పటికే గ్రౌండ్ అయిన విమానాలను చాలా వరకు పునరుద్ధరించామని, కొత్తగా రానున్న విమానాలను అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఇతర విమాన సర్వీసులతో పోటీపడగలమని, ఎయిరిండియా ట్రాఫిక్ను పెంచగలమన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అకౌంట్లోకి PF వడ్డీ
కస్టమర్ల కోసం AIరిండియా
మరోవైపు కస్టమర్ సర్వీసుల కోసం ‘మహరాజా’ పేరిట జనరేటివ్ ఏఐ వర్చువల్ ఏజెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి జనరేటివ్ ఏఐని తీసుకొచ్చిన విమానయాన సంస్థ తమదేనని పేర్కొంది. ప్రస్తుతం ఈ వర్చువల్ అసిస్టెంట్ రోజుకు సగటున 6 వేల మంది కస్టమర్ల సందేహాలను నివృత్తి చేస్తోందని, భవిష్యత్లో మరిన్ని ఫీచర్లు దీనికి జోడించనున్నట్లు పేర్కొంది. పైలట్ లాంచ్లో భాగంగా 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది కస్టమర్ల అవసరాలను తీర్చిందని, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో ఈ ఏజెంట్ సంభాషిస్తుందని తెలిపింది. ఫ్లైట్ స్టేటస్, బ్యాగేజీ అలవెన్సులు, ప్యాకేజీ నిబంధనలు, చెక్-ఇన్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి 1300 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోంటోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?