Diesel ATM: డాటమ్.. ఈ ఏటీఎమ్ నుంచి డీజిల్ విత్డ్రా చేయొచ్చు!
ఇప్పటిదాకా.. ఏటీమ్ల నుంచి నగదు విత్డ్రా చేయడం గురించి విన్నాం. తర్వాత కొన్నిచోట్లు ఫుడ్ ఏటీమ్లు కూడా వచ్చాయి. తాజాగా పుణెకు చెందిన ఓ సంస్థ డీజిల్ ఏటీమ్ను పరిచయం చేసింది. దీని ద్వారా లాజిస్టిక్ సంస్థల్లో డీజిల్ నిర్వహణ సులభతరం అవుతుందని చెబుతోంది.
పుణె: భారత దేశ స్థూల జాతీయోత్పత్తిలో లాజిస్టిక్ రంగం వాటా సుమారు 14.4 శాతం ఉంటుందని అంచనా. ఈ రంగంలో సరుకు రవాణా కోసం ఉపయోగించే వాటిలో డీజిల్ వాహనాలే (Diesel Vehicles) అధికం. పెద్ద లాజిస్టిక్ సంస్థలతో పోలిస్తే చిన్న, మధ్యతరహా సంస్థలే ఎక్కువగా డీజిల్ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కొంత మంది వ్యక్తులు డీజిల్ కొనుగోలు, నిర్వహణలో మోసాలకు పాల్పడుతూ.. సంస్థల ఆదాయానికి గండికొడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీజిల్ మోసాలకు చెక్ పెట్టేందుకు పుణెకు చెందిన రెపోస్ ఎనర్జీ (Repos Energy) సంస్థ ఒక సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేసింది. డాటమ్ (DATUM) స్మార్ట్ డీజిల్ స్టోరేజ్ పేరుతో డీజిల్ ఏటీఎమ్ (Diesel ATM)లను రెపోస్ ఎనర్జీ తీసుకొచ్చింది.
ఈ డీజిల్ ఏటీఎమ్లతో స్వతంత్ర రవాణా వ్యవస్థలను నిర్వహించే సంస్థలు డీజిల్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చని రెపోస్ ఎనర్జీ చెబుతోంది. ‘‘డీజిల్ ఏటీఎమ్ల ఏర్పాటుతో సంస్థలు డీజిల్పై ఖర్చు చేసే మొత్తంలో ఏటా 10 శాతం ఆదా అవుతుంది. వీటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకొని 24X7 డీజిల్ను పొందొచ్చు. ఇప్పటి వరకు వేర్వేరు రాష్ట్రాల్లో 300 డాటమ్లను ఇన్స్టాల్ చేశాం. ఒక్కో డాటమ్కు 4.8 మిలియన్ లీటర్ల డీజిల్ నిల్వ సామర్థ్యం ఉంటుంది. వీటి ద్వారా నెలకు ఆరు వేలకు పైగా వాహనాలకు డీజిల్ను అందించవచ్చు. డీజిల్ కోసం వాహనాలు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ఏటా నాలుగు లక్షల లీటర్ల డీజిల్ ఆదా అవడంతోపాటు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని రెపోస్ ఎనర్జీ వ్యవస్థాపకుడు చేతన్ వలుంజ్ తెలిపారు.
లాజిస్టిక్ సంస్థలకు డీజిల్ కొనుగోలును సులభతరం చేయడంతోపాటు, వృధాను అడ్డుకోవడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వీటిని ఆవిష్కరించినట్లు చేతన్ వెల్లడించారు. డాటన్ స్మార్ట్ స్టోరేజ్ ట్యాంక్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సంస్థలు రెసోస్ ఎనర్జీ యాప్ ద్వారా డీజిల్ ఆర్దర్ చేయొచ్చు. ఈ ఏటీఎమ్ నుంచి సంస్థలోని ఉద్యోగులు స్మార్ట్కార్డ్ల ద్వారా డీజిల్ను తమ వాహనాల్లో నింపుకోవచ్చని రెపోస్ ఎనర్జీ తెలిపింది. లాజిస్ట్ అవసరాల కోసం బ్రిక్స్ దేశాలు ఖర్చు చేస్తున్న మొత్తంలో భారత్ వాటా 13-14 శాతం ఉంటుందని అంచనా. అయితే, జాతీయ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని13-14 శాతం నుంచి 7.5-8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు డాటమ్ స్మార్ట్ డీజిల్ స్టోరేజ్ ట్యాంక్లు కీలక భూమిక పోషిస్తాయని సంస్థ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?