ITR Filing: పన్ను రిటర్నులు.. ఈ పొరపాట్లు చేయొద్దు
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్ను పూర్తి చేసేటప్పుడు అసెసీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి దొర్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు (ITR Filing) చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్ (ITR)ను పూర్తి చేసేటప్పుడు అసెసీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి దొర్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.
చాలామంది తాము ఆదాయపు పన్ను రిటర్నులు సరిగ్గానే పూర్తి చేశామనే భావనలో ఉంటారు. ఐటీ విభాగం నుంచి నోటీసు రావడం లేదా రిఫండు ఆలస్యమైనప్పుడే పొరపాటు దొర్లినట్లు గుర్తిస్తారు. ఆదాయపు పన్ను సెక్షన్ల గురించి సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం.
✍ కొన్నిసార్లు పన్ను చెల్లింపుదారులకు తాము ఆశించిన రిఫండుకన్నా తక్కువ వస్తుంది. కొన్నిసార్లు డిమాండు నోటీసు రావచ్చు. దీనికి ప్రధాన కారణం.. ఫారం 26ఏఎస్లో పేర్కొన్న టీడీఎస్లు సరిగ్గా నమోదు చేయకపోవడమే. ఇప్పుడు జమైన పన్ను రిటర్నుల ఫారంలో ముందే నింపి ఉంటుంది. అయినప్పటికీ..ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం మంచిది.
✍ షేర్ల లావాదేవీలు నిర్వహించినప్పుడు.. దీర్ఘకాలిక లాభాలు, స్వల్పకాలిక లాభాల మధ్య తేడా ఉంటుంది. స్వల్పకాలిక లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే దీర్ఘకాలిక లాభాలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దాటినప్పుడు.. ఆ పైన మొత్తానికి 10 శాతం పన్ను వర్తిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా.. పన్ను రిటర్ను (ITR)ల్లో ఈ ఆదాయాలను నమోదు చేయకపోతే.. ఇబ్బందులు రావచ్చు.
✍ రిటర్నులు సరిగ్గా దాఖలు చేసినా కొన్నిసార్లు రిఫండు రాకపోయే ఆస్కారం ఉంది. దీనికి కారణం బ్యాంకు వివరాల్లో పొరపాటు ఉండటం. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం అయినప్పుడే రిటర్నులను దాఖలు చేయడానికి వీలుంటుంది. ఈ వివరాలు బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలతోనూ సరిపోవాలి. అప్పుడే రిఫండు వేగంగా అందుతుంది.
✍ సరైన ఫారాన్ని ఎంచుకోకపోతే.. రిటర్నులు దాఖలు చేసినా.. ఆదాయపు పన్ను శాఖ దాన్ని అధీకృతం చేయకపోవచ్చు. కొన్నిసార్లు ఆ రిటర్నులను తిరస్కరిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకటికి మించి ఇళ్లు ఉన్నా, రూ.50లక్షలకు మించి ఆదాయం ఉన్నా ఐటీఆర్-1లో దాఖలు చేయడానికి వీలుండదు.
✍ కొన్నిసార్లు ఫారం-16లో అన్ని మినహాయింపులూ పేర్కొనకపోవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో మీరు చేసిన పన్ను మినహాయింపు పెట్టుబడులన్నీ ఇందులో నమోదయ్యాయా చూసుకోండి. లేకపోతే ఆయా మినహాయింపులను ఐటీఆర్లో తెలియజేయండి. ఈ సమయంలో సరైన సెక్షన్ల కింద వాటిని పేర్కొనండి.
✍ దాదాపు అందరికీ బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉంటుంది. అందులో ఉండే సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంటుంది. అయితే, చాలా మంది ఈ వడ్డీని ఐటీఆర్లో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా ఐటీఆర్లో చూపించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం.. సేవింగ్స్ ఖాతాపై లభించే వడ్డీలో రూ.10,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్కైతే సెక్షన్ 80టీటీబీ కింద ఈ పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది.
✍ పన్ను చెల్లింపుదారులకు రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుని పన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపికలో గందరగోళం వద్దు. పాత విధానంలో శ్లాబ్ల సంఖ్య తక్కువ. అయితే కొన్ని మినహాయంపులను పొందే వీలుంది. కొత్త విధానంలో మినహాయింపులు వర్తించవు.
పాస్వర్డ్ మర్చిపోతే..
ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు www.incometax.gov.in అనే వెబ్సైటులో మీ పాన్ (యూజర్ఐడీ), పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ కావాలి. ఏడాది తర్వాత లాగిన్ కావడంతో చాలామంది పాస్వర్డ్ను మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు సులభంగానే కొత్త పాస్వర్డ్ను సిద్ధం చేసుకోవచ్చు. లాగిన్పేజీలో ముందుగా పాన్ వివరాలు ఇచ్చిన తర్వాత, ‘ఫర్గాట్ పాస్వర్డ్’ను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ఆధార్ ఓటీపీ, డిజిటల్ సిగ్నేచర్ (డీఎస్సీ), ఇ-ఫైలింగ్ ఓటీపీలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. వీటన్నింటిలో ఆధార్ ఓటీపీ ద్వారా పాస్వర్డ్ను మార్చుకోవడం చాలా సులభం. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఒకసారి సరిచూసుకోండి. మొబైల్, ఇ-మెయిల్ మీకు సంబంధించనవేనా అనేది తనిఖీ చేసుకోండి. మార్పులుంటే వాటిని అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM