BLS E-Services IPO: బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే!
BLS E-Services IPO: రూ.310.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ ఐపీఓ ప్రారంభమైంది.
BLS E-Services IPO | ముంబయి: డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ (BLS E-Services IPO) మంగళవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.129-135గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.310.91 కోట్లు సమీకరించనుంది. మొత్తం 2.30 కోట్ల కొత్త షేర్లను ఐపీఓ (IPO)లో జారీ చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. మదుపర్లు రూ.14,580తో కనీసం 108 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐపీఓ (BLS E-Services IPO) ద్వారా సమీకరించిన నిధులతో తమ సాంకేతిక వ్యవస్థల బలోపేతం, కొత్త ప్లాట్ఫామ్ల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న వాటి అనుసంధానం వంటి కార్యకలాపాలు చేపడతామని బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ తెలిపింది. బీఎల్ఎస్ స్టోర్ల ఏర్పాటు, ఇతర వ్యాపారాల కొనుగోళ్లు, కార్పొరేట్ అవసరాలకూ కొన్ని నిధులు వాడతామని పేర్కొంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.126 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరు రూ.135 చొప్పున 93.27 లక్షల షేర్లను 10 ఫండ్లకు కేటాయించింది.
బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ను 2016లో స్థాపించారు. ఈ కంపెనీ వీసా, పాస్పోర్ట్, కాన్సులర్ సహా ఇతర పౌర సేవలను అందిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారత్లో కొన్ని ప్రధాన బ్యాంకులకు బిజినెస్ కరెస్పాండెన్స్ సర్వీసులను అందిస్తోంది. 2022-23లో కంపెనీ ఆదాయం రూ.243 కోట్లు, లాభం రూ.20.33 కోట్లు, ఆస్తుల విలువ రూ.179.47 కోట్లుగా నమోదైంది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: జనవరి 30- ఫిబ్రవరి 01
- ధరల శ్రేణి: రూ.129-135
- షేరు ముఖ విలువ: రూ.10
- కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 108 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,580
- అలాట్మెంట్ తేదీ: ఫిబ్రవరి 02
- రిఫండ్ తేదీ: ఫిబ్రవరి 05
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ: ఫిబ్రవరి 05
- లిస్టింగ్ తేదీ: ఫిబ్రవరి 06
(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్