IPO: రూ.664 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2 ఐపీఓలు ప్రారంభం
IPO: రూ.235.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్లాటినం ఇండస్ట్రీస్.. రూ.429 కోట్ల నిధుల కోసం ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ ఐపీఓలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: పీవీసీ స్టెబిలైజర్ల తయారీ సంస్థ ప్లాటినం ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ (Platinum Industries IPO) మంగళవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 29 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.162-171గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.235.32 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,877తో 87 షేర్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రిటైల్ మదుపర్లకు 35 శాతం, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు 50 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ ఐపీఓలో (IPO) మొత్తం 1.38 కోట్ల కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి వాటాలు అందుబాటులో లేవు. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టవుతాయి.
ప్లాటినం ఇండస్ట్రీస్ లిమిటెడ్ను 2016లో స్థాపించారు. పీవీసీ స్టెబిలైజర్లు, సీపీవీసీ అడిటివ్లు, ల్యూబ్రికెంట్లను తయారు చేస్తుంది. పీవీసీ పైపులు, ప్రొఫైళ్లు, ఫిట్టింగులు; ఎలక్ట్రికల్ వైర్లు, కేబుళ్లు; ఎస్పీసీ ఫ్లోర్ టైళ్లు, రిజిడ్ పీవీసీ ఫోమ్ బోర్డులు, ప్యాకేజింగ్ మెటీరియళ్లలో ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో కంపెనీ తయారీ కేంద్రం ఉంది. జులై 2023 నాటికి ఈ సంస్థకు 12 పంపిణీ కేంద్రాలున్నాయి.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: ఫిబ్రవరి 27-29
- ధరల శ్రేణి: రూ.162-171
- షేరు ముఖ విలువ: రూ.10
- కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 87 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,877
- అలాట్మెంట్ తేదీ: మార్చి 1
- రిఫండ్ తేదీ: మార్చి 4
- లిస్టింగ్ తేదీ: మార్చి 5
ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ ఐపీఓ
ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ (Exicom Tele Systems IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. గురువారం వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.135-142గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.429 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,200తో 100 షేర్లు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో మొత్తం రూ.329 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. మరో రూ.100 కోట్లు విలువ చేసే 70.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. ఈ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టవుతాయి.
ఎగ్జికామ్ టెలీ-సిస్టమ్స్ లిమిటెడ్ను 1994లో స్థాపించారు. పవర్ సిస్టమ్స్, విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ సంబంధిత వసతులను కల్పిస్తోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ భారత్ సహా ఆగ్నేయాసియాలో 61,000 డీసీ, ఏసీ ఛార్జర్లను ఏర్పాటు చేసింది. 2023 సెప్టెంబర్ నాటికి 15 ప్రముఖ వాహన తయారీ సంస్థలు దీనికి కస్టమర్లుగా ఉన్నాయి.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: ఫిబ్రవరి 27-29
- ధరల శ్రేణి: రూ.135-142
- షేరు ముఖ విలువ: రూ.10
- కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 100 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,200
- అలాట్మెంట్ తేదీ: మార్చి 1
- రిఫండ్ తేదీ: మార్చి 4
- లిస్టింగ్ తేదీ: మార్చి 5
(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్