Written off Loans: రైటాఫ్ రుణాల రికవరీ 15 శాతం లోపే!
Written off Loans: రైటాఫ్ చేస్తున్న రుణాల వసూలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది.
దిల్లీ: రైటాఫ్ (సాంకేతికంగా రద్దు) (Written off Loans) చేసిన రుణాలను వసూలు చేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. రికవరీ రేటును 40 శాతానికి పెంచాలని కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఇది 14 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.7.34 లక్షల కోట్లు రైటాఫ్ (Written off Loans) చేసినట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దాంట్లో 14 శాతానికి సమానమైన రూ.1.03 లక్షల కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. ఈ వసూలు అనంతరం నికరంగా రైటాఫ్ రుణాల విలువ రూ.6.31 లక్షల కోట్లకు పరిమితమైందని పేర్కొన్నారు. అయితే, రైటాఫ్ (Written off Loans) చేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయని ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సదరు అధికారి తెలిపారు. ఇంత తక్కువ స్థాయి రికవరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. అధిక రికవరీ వల్ల బ్యాంకుల మూలధనమే మెరుగవుతుందని సూచించినట్లు తెలిపారు.
ఈ అంశంపై సమీక్ష నిర్వహించేందుకు కేంద్ర ఆర్థిక సేవల విభాగం త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. వివిధ కోర్టులు, రుణ వసూళ్ల ట్రైబ్యునళ్ల దగ్గర పెండింగ్లో ఉన్న కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నాయి.
నికర నిరర్థక ఆస్తులకు నాలుగేళ్లు పూర్తయ్యాక.. వాటికి పూర్తిగా కేటాయింపులు జరిపి ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డుల ఆమోదం మేర రైటాఫ్ (Written off Loans) పేరుతో ఆ రుణాలను బ్యాలెన్స్ షీట్ల నుంచి బ్యాంకులు తొలగిస్తాయి. బ్యాలెన్స్ షీట్లను ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకునే ప్రక్రియలో భాగంగా రైటాఫ్ రుణాల ప్రభావాన్ని బ్యాంకులు మదింపు చేస్తుంటాయి. అయితే రైటాఫ్ (Written off Loans) చేసినంత మాత్రాన.. రుణ గ్రహీతలకు ఆ రుణ బకాయిలు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చినట్లు కాదు. రైటాఫ్ చేసిన రుణ బకాయిలను రుణ గ్రహీతల నుంచి వసూలు చేసేందుకు వివిధ పద్ధతుల్లో బ్యాంకులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇందుకోసం సివిల్ కోర్టులో కేసులు వేయడం, రుణాల వసూళ్ల ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్- 2002 కింద చర్యలు చేపట్టడం లాంటివి బ్యాంకులు చేస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం