Doms IPO: డోమ్స్ ఐపీఓకు భారీ స్పందన.. 93.40 రెట్ల సబ్స్క్రిప్షన్
Doms IPO: డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు భారీ స్పందన లభించింది. చివరి రోజైన శుక్రవారం నాటికి 93.40 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.
Doms IPO | దిల్లీ: పెన్సిళ్ల తయారీ కంపెనీ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు (Doms IPO) భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ ఐపీఓకు మొత్తం 93.40 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో భారీగా బిడ్లు దాఖలయ్యాయి.
రూ.1200 కోట్లు నిధుల సమీకరణకు వస్తున్న డోమ్స్ ఇండస్ట్రీస్ 88.37 లక్షల షేర్లు ఆఫర్ ఫర్ సేల్లో అందుబాటులో ఉంచగా.. 82.54 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల కోటా ఏకంగా 115.97 రెట్లు సబ్స్క్రైబ్ కాగా.. రిటైల్ పోర్షన్ 69.10 రెట్ల బిడ్లు దాఖలయ్యయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది.
ఐపీఓలో ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.750-790గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సబ్స్క్రిప్షన్కు వచ్చిన తొలి రోజే (బుధవారం) 5.71 రెట్ల సబ్స్క్రిప్షన్ పొందిన డోమ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.538 కోట్లు సమీకరించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాన్ని కొత్త తయారీ కేంద్రం నెలకొల్పి తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీ భావిస్తోంది.
ఐనాక్స్ ఇండియా ఐపీఓకు 7 రెట్ల స్పందన
క్రయోజనిక్ ట్యాంకులు తయారు చేసే ఐనాక్స్ ఇండియా ఐపీఓ రెండో రోజైన శుక్రవారం నాటికి 7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. 1.54 కోట్ల షేర్లు అందుబాటులో ఉంచగా.. 10.94 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఎన్ఐఐ కోటా 13.73 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 8.17 రెట్ల బిడ్లు దాఖలవ్వగా.. క్యూఐబీ కోటా కేవలం 17 శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ అందుకుంది. ధరల శ్రేణి రూ.627-660గా కంపెనీ నిర్ణయించింది. పూర్తి ఆఫర్ ఫర్సేల్ పద్ధతిన షేర్లు సమీకరిస్తుండడంతో నిధులు కంపెనీకి వెళ్లవు. సోమవారంతో సబ్స్క్రిప్షన్ ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్