Android Users: ‘హై రిస్క్’లో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక
ఆండ్రాయిడ్ (Android)లోని కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని CERT-In వెల్లడించింది. ఇవి అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది.
దిల్లీ: ఆండ్రాయిడ్ (Android) ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాల (vulnerabilities)ను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాలను ‘అత్యంత తీవ్రమైనవి’గా పేర్కొన్న CERT-In.. వీటితో సైబర్ నేరగాళ్లు (Cyber Attack) ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశముందని హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ (Android) 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు CERT-In తమ ప్రకటనలో వెల్లడించింది. ఫ్రేమ్వర్క్, ఆండ్రాయిడ్ రన్టైమ్, సిస్టమ్ కాంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నెల్, ఆర్మ్ కాంపోనెంట్స్, క్వాల్కమ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్లో తప్పిదాల కారణంగా ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపింది.
బ్రౌజర్ను అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందే.. క్రోమ్ యూజర్లకు కేంద్రం సూచన
ప్రమాదం ఇలా..
వీటిని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మన మొబైల్ ఫోన్లలో పాస్వర్డ్లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని CERT-In హెచ్చరించింది. హ్యాకర్లు ఫోన్లపై దాడి చేసినప్పుడు.. మొబైల్ను వారి అధీనంలోకి తీసుకుని ప్రమాదకర సాఫ్ట్వేర్ను జొప్పించడం, డివైజ్ను పనికిరాకుండా చేసేందుకు ఈ లోపాలు ఉపయోగపడుతాయని పేర్కొంది.
యూజర్లు ఏం చేయాలి..?
ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది. ఇందుకోసం డివైజ్ సెట్టింగ్స్లోకి వెళ్లి System అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత System updatesపై క్లిక్ చేసి.. ఏదైనా అప్డేట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇచ్చిన సూచనలు పాటిస్తూ దాన్ని అప్డేట్ చేసుకోవాలని CERT-In తెలిపింది. దీంతో పాటు యూజర్లకు పలు సూచనలు చేసింది.
- విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ఫోన్లో మాల్వేర్ ఉందా?లేదా? అని తెలుసుకునేందుకు సెక్యూరిటీ యాప్ను వినియోగించాలి.
- విశ్వసనీయమైన వ్యక్తులు/సంస్థలు పంపిన ఈమెయిళ్లు, అటాచ్మెంట్లను మాత్రమే తెరవాలి.
- బలమైన పాస్వర్డ్తో పాటు యాప్స్లో టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఉపయోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే. -
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్తో చేతులు కలిపింది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ప్రయోజనాలు సహా పూర్తి వివరాలు చూద్దాం... -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి.
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM