World Cup: వరల్డ్ కప్ టికెట్లపై వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!
World Cup: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ టికెట్లకు ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది.
దిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ (World Cup 2023) మేనియా నడుస్తోంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తుది పోరు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యక్షంగా లక్షకుపైగా.. టీవీల ముందు కోట్లాది మంది వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి మ్యాచ్ టికెట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఓ వర్గం నుంచి విమర్శలూ ఎదురవుతున్నాయి.
సాధారణంగా ఇలాంటి మ్యాచ్లకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నిర్వాహకులే స్వయంగా ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్లు అందజేస్తుంటారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు పాస్లు పొందారు. దీనిపైనే తాజాగా గోయెంకా ఓ విమర్శనాత్మక పోస్ట్ చేశారు. వ్యాపారావేత్తల్లోని తమ స్నేహితులెవరూ టికెట్లు కొనలేదన్నారు. ఏదోలా ఉచిత పాస్లు పొందారని తెలిపారు. ఇక్కడే అసలు విషయం దాగుందని.. ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు.
గోయెంకా పోస్ట్పై ఓ యూజర్ స్పందిస్తూ.. ‘‘అసలు మీరు టికెట్ కొని వెళ్తున్నారా? లేక పాస్ తీసుకున్నారా?’’ అని ఆరా తీశారు. దీనికి ఆయన ప్రతిస్పందిస్తూ.. రెండూ తీసుకోలేదని చెప్పారు. అయితే, కొన్ని వర్గాల నుంచి గోయెంకా పోస్ట్పై విమర్శలూ వస్తున్నాయి.
ఒక్క టికెట్ రూ.1.87 లక్షలు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ఒక్కో టికెట్ ధర దాదాపు రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. ఓ టికెట్ రీ-సెల్లింగ్ వెబ్సైట్ ప్రకారం.. టైర్ 4 టికెట్ ధర ఏకంగా రూ.1,87,407గా ఉంది. దీనికి పక్కనే ఉండే టైర్ టికెట్ ధర రూ.1,57,421గా ఉంది. ఈ వెబ్సైట్లో అతి తక్కువగా ఉన్న టికెట్ ధర రూ.32,000. ఈ ధరలను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..