Jio AirFiber: మరో 115 పట్టణాలకు జియో ఎయిర్ఫైబర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే
Jio AirFiber: తొలుత ఎనిమిది మెట్రో నగరాల్లో జియో ఎయిర్ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ సర్వీస్ను మరో 115 నగరాలకు విస్తరించారు.
Jio AirFiber | ఇంటర్నెట్ డెస్క్: 5జీ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు ‘జియో ఎయిర్ఫైబర్ (Jio AirFiber)’ను రిలయన్స్ జియో మరికొన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించింది. తొలుత ఈ సర్వీసులను హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, ముంబయి, పుణె.. మొత్తం 8 మెట్రో నగరాల్లో మాత్రమే ప్రారంభించారు. దీపావళి సందర్భంగా తాజాగా మరో 115 నగరాలకు విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వెబ్సైట్లో జియో ఎయిర్ఫైబర్ (Jio AirFiber) కోసం ప్రత్యేకంగా ఓ పేజీని ప్రారంభించిన కంపెనీ.. నగరాలు/పట్టణాల జాబితాను అందులో అందుబాటులో ఉంచింది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ: హైదరాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, వరంగల్
వీటతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, పశ్చిమబెంగాల్లో పలు నగరాలకు జియో ఎయిర్ఫైబర్ సేవలను విస్తరించారు. ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్లో 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్లు, స్మార్ట్హోమ్ సేవలు పొందొచ్చన్న విషయం తెలిసిందే.
జియో ఎయిర్ఫైబర్ కనెక్షన్ ఎలా పొందాలి? ఏమేం వస్తాయ్?
జియో ఎయిర్ఫైబర్ ప్లాన్లు ఇవే..
- రూ.599 (30 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు
- రూ.899 (100 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు
- రూ.1199 (100 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
జియో ఎయిర్ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు..
- రూ.1,499 (300 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
- రూ.2,499 (500 ఎంబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం
- రూ.3,999 (1 జీబీపీఎస్): 550+ డిజిటల్ ఛానెళ్లు, 14 ఓటీటీ యాప్లు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం
* 14 ఓటీటీ ఛానెళ్లలో జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్, సోనీలివ్, జీ5, యూనివర్సల్+, లయన్స్ గేట్, సన్నెక్ట్స్, హోయ్చాయ్, డిస్కవరీ+, షెమారూమీ, ఆల్ట్ బాలాజీ, ఇరోస్ నౌ, ఎపిక్ ఆన్, డాక్యుబె వంటివి లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్