Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్ కనెక్షన్ ఎలా పొందాలి? ఏమేం వస్తాయ్?
Jio AirFiber 5G full details: జియో ఎయిర్ఫైబర్ సర్వీసులను రిలయన్స్ లాంచ్ చేసింది. ఈ కనెక్షన్ ఎలా పొందాలి? ఏమేం వస్తాయ్? పూర్తి వివరాలు ఇవీ..
Jio AirFiber 5G | ఇంటర్నెట్ డెస్క్: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మంగళవారం జియో ఎయిర్ఫైబర్ (Jio AirFiber) సర్వీసులను లాంచ్ చేసింది. ఫైబర్ గ్రిడ్ నెట్వర్క్లేని చోట సులువుగా బ్రాడ్బ్యాండ్ సదుపాయం అందించేందుకు ఈ ఎయిర్ఫైబర్ ఉపయోగపడనుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, ముంబయి, పుణె.. 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్ సంస్థ ఈ తరహా సేవలను ప్రారంభించింది. దీంతో ఈ విభాగంలో ఇరు సంస్థలకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇంతకీ జియో ఎయిర్ ఫైబర్ ఎలా బుక్ చేయాలి? ఏమేం వస్తాయ్? ప్లాన్లు ఏంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జియో ఎయిర్ఫైబర్ ఎలా బుక్ చేయాలి?
జియో ఎయిర్ఫైబర్ బుక్ చేయడానికి 60008-60008 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదంటే జియో.కామ్లో లేదా దగ్గర్లోని జియో స్టోర్కి వెళ్లి జియో ఎయిర్ఫైబర్ సర్వీసుల కోసం రిక్వెస్ట్ పంపించొచ్చు. ఇది వరకే జియో ఫైబర్ సేవలను పొందుతున్న వారూ కనెక్షన్ తీసుకోవచ్చు. ఒకసారి కనెక్షన్ కోసం రిక్వెస్ట్ చేశాక.. జియో ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఎయిర్ ఫైబర్ కనెక్షన్ బుకింగ్ కోసం జియో రూ.100 ఛార్జీ చేస్తోంది. దీన్ని ప్లాన్ మొత్తం నుంచి మినహాయిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఇన్స్టలేషన్లు ప్రారంభం కానున్నాయి.
హోమ్ లోన్ చెల్లించేశారా? ఈ పత్రాలన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు!
ఏమేం వస్తాయ్
జియో ఎయిర్ఫైబర్ అనేది ప్లగ్ అండ్ ప్లే డివైజ్. ఈ కనెక్షన్పై ఇంటర్నెట్ సేవలతో పాటు డిజిటల్ టీవీ ఛానెళ్లు కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం జియో వైఫై రౌటర్ను, 4కె స్మార్ట్ సెటాప్ బాక్స్ను జియో అందిస్తోంది. వాయిస్ యాక్టివ్ రిమోట్ కూడా కనెక్షన్తో పాటు ఇస్తారు. సిగ్నల్ కోసం ఇంటి పైకప్పు మీద లేదా ఇంటి బయట ఔట్డోర్ యూనిట్ను అమరుస్తారు. ఇందుకోసం రూ.1000 ఇన్స్టలేషన్ ఛార్జి వసూలు చేస్తారు. అయితే, వార్షిక ప్లాన్ తీసుకునే వారికి ఇన్స్టలేషన్ ఛార్జి నుంచి మినహాయింపు ఉంటుంది. లాంగ్టర్మ్ ప్లాన్ తీసుకునే వారికి క్రెడిట్/డెబిట్ కార్డు ఆధారిత ఈఎంఐ సదుపాయం ఉంది.
ప్లాన్లు ఏంటి? ఎంత చెల్లించాలి?
జియో ఎయిర్ ఫైబర్ రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ రూ.599, రూ.899, రూ.1199గా జియో పేర్కొంది. జియో ఎయిర్ఫైబర్ మ్యాక్స్ ప్లాన్ల ధరలు రూ.1499, 2499, రూ.3999గా నిర్ణయించింది. ప్లాన్ మొత్తానికి 18 శాతం జీఎస్టీ అదనం. ఇవి 6 నెలలు, 12 నెలల ప్లాన్లతో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు రూ.599 ప్లాన్ను తీసుకుంటే 6 నెలలకు గానూ జీఎస్టీ, ఇన్స్టలేషన్తో కలిపి దాదాపు రూ.5499 చెల్లించాల్సి ఉంటుంది. అదే 12 నెలలకు తీసుకుంటే ఇన్స్టలేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది కాబట్టి రూ.8600 చెల్లిస్తే సరిపోతుంది. అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్తో పాటు 550కు పైగా డిజిటల్ ఛానెళ్లు పొందొచ్చు. 14 ఓటీటీ యాప్స్ ఉచితంగా లభిస్తాయి. ప్లాన్ను బట్టి ఇంటర్నెట్ వేగం, ఓటీటీ అప్లికేషన్లలో మార్పు ఉంటుంది. 14 ఓటీటీ ఛానల్స్లో జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్, సోనీలివ్, జీ5, యూనివర్సల్+, లయన్స్ గేట్, సన్నెక్ట్స్, హోయ్చాయ్, డిస్కవరీ+, షెమారూమీ, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, ఎపిక్ ఆన్, డాక్యుబె వంటివి లభిస్తాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం ప్లాన్లు రూ.1199 నుంచి మొదలవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!