Jio Financial: బాండ్ల జారీకి సిద్ధమవుతున్న జియో ఫైనాన్షియల్!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్యే రూ.20వేల కోట్లు సమీకరించగా.. జియో ఫిన్ రూ.5 వేల నుంచి రూ.10వేల కోట్ల వరకు సమీకరించనున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బాండ్ల జారీ ద్వారా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల మేర సమీకరించాలని ఆ కంపెనీ ఆశిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బాండ్ల జారీ చేయొచ్చని తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో జియో ఫైనాన్షియల్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. దేశీయంగా బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలకు గట్టి పోటీనివ్వాలని ఆ సంస్థ భావిస్తోంది. హోమ్, పర్సనల్, ఆటో లోన్స్ ద్వారా పూర్తి స్థాయి ఫైనాన్షియల్ సంస్థగా అవతరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బాండ్లు జారీ చేసేందుకు జియో ఫైనాన్షియల్ సిద్ధమవుతోంది. బాండ్ల జారీకి ముందు క్రెడిట్ రేటింగ్తో పాటు సంబంధిత అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది.
Credit Cards: కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!
జియో ఫైనాన్షియల్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీ వెన్నుదన్నుగా ఉన్న నేపథ్యంలో ‘ఏఏఏ’ రేటింగ్ రావడం సులభమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధర, కాలవ్యవధి వంటివి జారీ సమయంలో తెలియరానున్నాయి. ఈ మధ్యే జియో ఫైనాన్షియల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పదేళ్ల కాలవ్యవధి కలిగిన బాండ్ల ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించింది. రిలయన్స్ జారీ చేసిన బాండ్ల కంటే జియో ఫిన్ జారీ చేసే బాండ్ల కూపన్ రేటు కాస్త అధికంగానే ఉండొచ్చని చెబుతున్నారు. బాండ్ల జారీపై జియో ఫైనాన్షియల్ అధికారికంగా స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.