రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి గ్లోబల్‌ షిప్‌ అవార్డు

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీని యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు వరించింది.

Published : 30 Oct 2023 20:14 IST

వాషింగ్టన్‌: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీని 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ (USISPF) గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు వరించింది. ఫోరమ్‌ ఛైర్మన్‌ జాన్ ఛాంబర్స్‌ చేతులు మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో ఫిరోజ్‌ అబ్బాస్‌ ఖాన్‌, సైనా నెహ్వాల్‌, అభినవ్‌ బింద్రా, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ డాక్టర్‌ ముకేశ్‌ అఘి ఉన్నారు. మహిళా సాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు నీతా అంబానీకి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు ఫోరమ్‌ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని