Reliance: టీవీ రంగంలో రూ.4,286 కోట్ల ఒప్పందం.. రిలయన్స్ చేతికి పారామౌంట్ వాటా
Reliance: ఇప్పటికే వాల్ట్ డిస్నీతో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వయాకామ్18లో పారామౌంట్ గ్లోబల్కున్న 13 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.
దిల్లీ: భారత టీవీ వ్యాపారంలో తమకున్న వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్కు (Reliance Industries) విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారామౌంట్ గ్లోబల్ (Paramount Global) గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ‘నిశ్చయాత్మక ఒప్పందం’ కుదిరినట్లు వెల్లడించింది. దీనికి నియంత్రణా సంస్థల అనుమతులు లభించాల్సి ఉన్నట్లు తెలిపింది. అలాగే కొన్ని షరతులు కూడా విధించుకున్నట్లు.. వాటికి ఇరు సంస్థలు కట్టుబడితేనే ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది.
వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో పారామౌంట్ గ్లోబల్కున్న 13.1 శాతం వాటాలను రూ.4,286 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. మరోవైపు రిలయన్స్, వయాకామ్ 18, స్టార్ డిస్నీ మధ్య ఏర్పాటు చేయదలచిన జాయింట్ వెంచర్ పూర్తయిన తర్వాతే తాజా కొనుగోలు ఒప్పందం అమల్లోకి వస్తుందని యూఎస్ ఎక్స్ఛేంజీలకు పారామౌంట్ (Paramount Global) తెలియజేసింది. కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పారామౌంట్ తమ కంటెంట్ను వయాకామ్18కు అందిస్తుందని వెల్లడించింది. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే వయాకామ్లో రిలయన్స్ వాటా 70.49 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్ షేరు గురువారం 0.50 శాతానికి పైగా పెరిగి రూ.2,881 వద్ద ట్రేడవుతోంది.
ఇప్పటికే భారత్లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. పలు భాషల్లో 120 టీవీ ఛానళ్లు (కలర్స్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్ లాంటి వినోద ఛానళ్లు; స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్ 18 లాంటి క్రీడా ఛానళ్లు), రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు (జియో సినిమా, హాట్స్టార్), దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకుల సంఖ్యతో భారత మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా ఇది నిలుస్తుంది. ‘ఒప్పందంలో భాగంగా స్టార్ ఇండియాలో వయాకామ్ 18 మీడియా వ్యాపారం విలీనం అవుతుంద’ని ఇరుసంస్థలు తెలిపాయి. విలీనానంతరం సంస్థ విలువ రూ.70,352 కోట్లుగా (8.5 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే సోనీ, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలతో పోటీపడేందుకు విలీనానంతర సంస్థలో రూ.11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా