రిలయన్స్ రిటైల్లో QIA పెట్టుబడి.. ఒక్క శాతం వాటాకు ₹8,278 కోట్లు
QIA to invest in Reliance Retail: రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ₹8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (Qatar Investment Authority) పెట్టుబడికి ముందుకొచ్చింది. ఒక్క శాతం వాటాకు గానూ రూ.8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.8.278 లక్షల కోట్లుగా గణించి క్యూఐఏ పెట్టుబడికి 0.99 శాతం ఈక్విటీ వాటా కేటాయించనున్నట్లు రిలయన్స్ రిటైల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
రిలయన్స్ రిటైల్లో క్యూఐఏ ఇన్వెస్ట్మెంట్పై సంస్థ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను, రిలయన్స్ వ్యాపార నమూనా, వ్యూహాల అమలుపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. క్యూఐఏ అంతర్జాతీయ అనుభవం, వాల్యూక్రియేషన్లో ఉన్న ట్రాక్ రికార్డును తమకు ఉపయోగపడనుందని తెలిపారు. భారత్లో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లో అధిక వృద్ధి సామర్థ్యం కలిగిన వినూత్న కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి QIA కట్టుబడి ఉందని ఆ సంస్థ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్ మహ్మద్ పేర్కొన్నారు. భారత్లో తమ పెట్టుబడుల వివిధీకరణలో ఈ పెట్టుబడి భాగమని పేర్కొంది.
రియల్మీ నుంచి 2 స్మార్ట్ఫోన్లు.. వెలకమ్ ఆఫర్ కింద ₹1500 డిస్కౌంట్
రిలయన్స్కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు దేశవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు మొత్తం 18,500 స్టోర్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొన్ని కంపెనీలను కొనుగోలు చేయడంతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల ఫ్రాంఛైజీలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ దక్కించుకుంటోంది. 2020లోనూ ఇలానే గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ద్వారా 10 శాతం వాటాలను విక్రయించి రూ.47,265 కోట్లను రిలయన్స్ రిటైల్ సమీకరించింది. అప్పట్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!