RBI Repo rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం
RBI Repo rate: ఆర్బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ౬.౫౦ శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది.
ముంబయిః మెజారిటీ నిపుణుల అంచనాలకు భిన్నంగా ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీరేట్ల (interest rates) పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని తెలిపారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి ‘మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee)’ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2023-24లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ గత ఏడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చింది. ఇప్పటి వరకు రెపోరేటును ౨౫౦ బేసిస్ పాయింట్లు పెంచింది. ౨౦౨౩ ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ౬.౪౪ శాతంగా నమోదైంది. అంతక్రితం నెల ఇది ౬.౫౨ శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతానికి పైనే స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్బీఐకి ఇప్పటి వరకు అనివార్యమైంది.
(Also Read: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?)
2023 ఆశాజనకంగా ప్రారంభమైందని శక్తికాంత దాస్ అన్నారు. సరఫరా వ్యవస్థలు మెరుగయ్యాయని.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పారు. ఫైనాన్షియల్ మార్కెట్లు ఆశాజనకంగా ముందుకు సాగాయాన్నారు. కానీ, మార్చి నెలలో పరిస్థితులు నాటకీయంగా అనూహ్య మలుపు తీసుకున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగంలో వచ్చిన కుదుపు గందరగోళ పరిస్థితుల్ని సృష్టించిందని పేర్కొన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థల స్థిరత్వంపై అనుమానాలు తెరపైకి వచ్చాయన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచుతూనే ఉన్నాయన్నారు. ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత వరకు అదుపులోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ లక్ష్యిత పరిధి కంటే ఆవలే ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు విషయంలో ఆయా కేంద్ర బ్యాంకులు కొంత నెమ్మదించినట్లు తెలిపారు. కానీ, పెంపు నుంచి ఇంకా పూర్తిగా విరమించలేదని గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంలోని కీలకాంశాలు..
- సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలనే నిర్ణయానికి కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఆమోదం.
- రెపోరేటు పెంపులో విరామం కేవలం ఈ సమీక్షకు మాత్రమే పరిమితం. భవిష్యత్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఆర్బీఐ వెనుకాడబోదు.
- దేశ బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి.
- 2022-23లో ఆర్థిక వృద్ధిరేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. 2023-24 జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంపు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 5.2 శాతం, తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా. ఆశించదగ్గ క్షీణత నమోదయ్యే వరకు ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుంది.
- ఇటీవల బ్యాంక్ పతనాల పరిణామంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని పర్యవసానాలపై ఆర్బీఐ దృష్టి సారించింది.
- 2022-23లో రూపాయి కదలికలు క్రమబద్ధంగా కొనసాగాయి. ఆర్బీఐ దీనిపై దృష్టి కొనసాగిస్తుంది.
- వివిధ బ్యాంకుల్లో క్లెయిం చేయని డిపాజిట్ల కోసం కేంద్రీకృత పోర్టల్ ఏర్పాటు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!